Arvind Kejriwal: రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరిస్తారా..? అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తదుపరి ప్రధాని కాగలననే ఊహాగానాలకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనే దానిపై కూడా పెద్దగా స్పందించలేదు. అలాంటి చర్చ జరగలేదని, ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ చిన్న పార్టీ అని, ఈ ఎన్నికల్లో కేవలం 22 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని చెప్పారు. తనకు తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
Read Also: kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
నియంతృత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. పీటీఐతో మాట్లాడిన కేజ్రీవాల్ ‘‘ఇండియా కూటమి గెలిస్తే తదుపరి ప్రధాని కావాలనే ఉద్దేశ్యం నాకు లేదు’’ అని అన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలందరిని జైలులో పెట్టడం ఖాయమని ఆరోపించారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. గతంలో కూడా ప్రధాని పదవి గురించి మాట్లాడుతూ.. తాను రేసులో లేని లక్నోలో చెప్పారు.
గత ఏడాది జూన్ నెలలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్తో పాటు కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. అయితే, తన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిని పక్కన పెట్టి విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే విమర్శనాస్త్రంగా బీజేపీ ఇండియా కూటమిని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలకు దేశాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక లేదని, వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మాత్రమే ఉందని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా బీజేపీ అభివర్ణిస్తోంది. సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలనున కూడా ఇదే విధంగా విమర్శిస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?