Arvind Kejriwal: రాహుల్ గాంధీని ప్రధానిగా అంగీకరిస్తారా..? అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తదుపరి ప్రధాని కాగలననే ఊహాగానాలకు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనే దానిపై కూడా పెద్దగా స్పందించలేదు. అలాంటి చర్చ జరగలేదని, ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ చిన్న పార్టీ అని, ఈ ఎన్నికల్లో కేవలం 22 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని చెప్పారు. తనకు తక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
Read Also: kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..
Also Read
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
నియంతృత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. పీటీఐతో మాట్లాడిన కేజ్రీవాల్ ‘‘ఇండియా కూటమి గెలిస్తే తదుపరి ప్రధాని కావాలనే ఉద్దేశ్యం నాకు లేదు’’ అని అన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలందరిని జైలులో పెట్టడం ఖాయమని ఆరోపించారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. గతంలో కూడా ప్రధాని పదవి గురించి మాట్లాడుతూ.. తాను రేసులో లేని లక్నోలో చెప్పారు.
గత ఏడాది జూన్ నెలలో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పడింది. ఈ కూటమిలో కాంగ్రెస్తో పాటు కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. అయితే, తన ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిని పక్కన పెట్టి విపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే విమర్శనాస్త్రంగా బీజేపీ ఇండియా కూటమిని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలకు దేశాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక లేదని, వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మాత్రమే ఉందని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని వంశపారంపర్య పార్టీగా బీజేపీ అభివర్ణిస్తోంది. సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలనున కూడా ఇదే విధంగా విమర్శిస్తోంది.
తాజావార్తలు
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..