Bihar: బీహార్లో మరో దారుణం.. మామతో ఉండేందుకు భర్తను చంపేసిన నవ వధువు
- బీహార్లో మరో దారుణం
- మామతో ఉండేందుకు భర్తను చంపేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామ్మో.. రోజురోజుకు మహిళల అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత దారుణంగా సోనమ్ రఘువంశీ అనే నవ వధువు చంపేసింది. ఈ దుర్ఘటనను దేశ ప్రజలంతా ఇంకా మరిచిపోలేదు. తాజాగా బీహార్లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మామ కోసం మూడు ముళ్లు వేసిన భర్తను 45 రోజులకే కొత్త పెళ్లికూతురు కాటికి పంపేసింది. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా పెళ్లంటేనే మగ వాళ్లు హడలెత్తిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara : పెళ్లి ఓ పొరపాటు.. విడాకులకు హింట్ ఇస్తూ నయనతార షాకింగ్ పోస్ట్
Also Read
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు(25), గుంజా దేవి(20)కి వివాహం జరిగింది. అయితే ఆమెకు అప్పటికే మామ జీవన్ సింగ్(భర్త తండ్రి కాదు)తో శారీరిక సంబంధం ఉంది. అతడితో పీకల్లోతు ప్రేమలో ఉంది. జీవన్ సింగ్(55)నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో తెగేసి చెప్పింది. అందుకు వారు అంగీకరించలేదు. 2 నెలల క్రితం నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశుతో దేవికి బలవంతంగా వివాహం జరిపించారు. కానీ మామ జీవన్ సింగ్ను మరిచిపోలేక ప్రియాంశుతో దూరంగా ఉంటుంది. ఇక నిత్యం జీవన్ సింగ్తోనే ఫోన్లో సంభాషిస్తోంది. ఈ క్రమంలోనే భర్తను చంపేయాలని కుట్ర పన్నింది.
ఇది కూడా చదవండి: Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!
అయితే ప్రియాంశు.. తన సోదరిని సందర్శించి రైల్లో తిరిగి నవీ నగర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. తనను తీసుకెళ్లేందుకు బైక్ పంపించాలని దేవిని కోరాడు. దేవి పంపించిన మనుషులు.. బైక్పై తీసుకొస్తుండగా మార్గమధ్యలో తుపాకీ తీసుకుని ప్రియాంశును కాల్చి చంపేశారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. దేవి గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇంతలో ప్రియాంశు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమె ఫోన్ డేటాను పరిశీలించగా బాగోతం బయటపడింది. మామ జీవన్ సింగ్తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. పెళ్లైన దగ్గర నుంచి నిత్యం జీవన్ సింగ్తోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దేవితో పాటు ఇద్దరు హంతకులను అరెస్ట్ చేశారు. జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు.
హత్య కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిందని పేర్కొన్నారు. మామతో శారీరిక సంబంధం ఉండడంతోనే భర్తను వదులించుకునేందుకు కుట్ర పన్నినట్లు చెప్పారు. దేవితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశామని.. జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
-
Car Mileage Tips : ఫోన్ ఛార్జింగ్తో మైలేజ్ పడిపోతుందా? కార్లలో దాగిన అసలు సీక్రెట్ ఇదే.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?