Railway Budget: రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో ఎందుకు కలిపారు..?
- 2017లో కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం..
- విలీనంతో ప్రయోజనాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Budget: భారతదేశ చరిత్రలో ‘‘రైల్వే బడ్జెట్’’కు ఘన చరిత్ర ఉండేది. అయితే, 2017లో దీనిని కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడం ద్వారా 92 ఏళ్ల పురానత అధ్యాయనానికి తెరపడింది. బడ్జెట్ మరింత సరళంగా, ఆచరణాత్మకంగా ఉండాలనే ఆలోచనతో రైల్వే బడ్జెట్ విలీనం జరిగింది. 2017-18లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారిగా సంయుక్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఎందుకు విలీనం చేశారు.?
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
నీతి ఆయోగ్ సభ్యులు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలోని కమిటీ రైల్వే బడ్జెట్ రద్దుకు సిఫారసు చేసింది. దశాబ్ధాల ఆచారానికి ముగింపు పలకడానికి దేబ్రాయ్, కిషోర్ దేశాయ్ల సిఫారసు పత్రాన్ని అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రభుత్వానికి సమర్పించారు. రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేసే అంశాన్ని సురేష్ ప్రభు, అరుణ్ జైట్లీలు పార్లమెంట్లో లేవనెత్తారు. దీని తర్వాత రెండు బడ్జెట్లను కలిపేశారు.
రెండు బడ్జెట్లను వేరు వేరుగా చూపడం కన్నా, ఒకే బడ్జెట్గా చూపితే మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టంగా తెలుస్తుందని ప్రభుత్వం భావించింది. మునుపటిలా రైల్వే ఖర్చులు వేరు, ప్రభుత్వ వ్యయాలు వేరు అని కాకుండా అన్ని ఆదాయాలు, వ్యయాలు ఒకే సీన్లో కనిపిస్తాయి. బడ్జెట్ విలీనం తర్వాత రైల్వేలు, రహదారులు, జలమార్గాలు ఈ మూడింటి మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. దీని ద్వారా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ లను సమర్థవంతంగా రూపొందించే అవకాశం ఏర్పడింది.
రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో లాగే స్వతంత్రంగా పనిచేస్తుంది. అయితే బడ్జెట్ లో భాగంగా ప్రత్యేక బడ్జెట్ అంచనాలు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అందుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ కోసం అప్రాప్రియేషన్ బిల్లు తయారు చేస్తుంది. ఇది అన్ని సంబంధిత శాఖల పనులను నిర్వహిస్తుంది. దీనికి అదనంగా రైల్వేలు ప్రభుత్వానికి డివిడెంట్లు చెల్లించాల్సిన అవసరం లేదు, మూలధన బకాయిలు కూడా రద్దు చేయబడ్డాయి.
తాజావార్తలు
-
Karuppu : కరుప్పు’ బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు ‘సూర్య’ ఖరీదైన గిఫ్ట్
-
Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..