Railway Budget: భారతదేశ చరిత్రలో ‘‘రైల్వే బడ్జెట్’’కు ఘన చరిత్ర ఉండేది. అయితే, 2017లో దీనిని కేంద్ర బడ్జెట్లో విలీనం చేయడం ద్వారా 92 ఏళ్ల పురానత అధ్యాయనానికి తెరపడింది. బడ్జెట్ మరింత సరళంగా, ఆచరణాత్మకంగా ఉండాలనే ఆలోచనతో రైల్వే బడ్జెట్ విలీనం జరిగింది. 2017-18లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారిగా సంయుక్త బడ్జెట్ను ప్రవేశపెట్టారు.