Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Presidential Poll 2022: దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?. మరి ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ఎందుకు వాడరో చూద్దాం.
ఈవీఎంలు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓట్ల అగ్రిగేటర్గా పనిచేసే సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు వ్యతిరేకంగా బటన్ను నొక్కి, గరిష్ట సంఖ్యలో ఓట్లు సాధించిన వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించబడతారు. సాధారణంగా లోక్సభ స్థానాలుకు గానీ, శాసనసభ స్థానాలకు ఓటర్లు అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బటన్ను నొక్కి ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అలా కుదరదు. ఓటింగ్లో పాల్గొనబోయే వ్యక్తి తన తొలి ప్రాధాన్య ఓటుతో పాటు రెండు, మూడు ప్రాధాన్య ఓట్లను కూడా వేయొచ్చు. 1, 2, 3.. ఇలా ఎంత మంది అభ్యర్థులు ఉంటే అంతమందికీ తన ప్రాధాన్య ఓటు వేయొచ్చు. అయితే, ఈవీఎంలలో ఈ ఏర్పాటు లేదు. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఈవీఎంలు రూపొందించాలి. అందుకనే వీటిని రాష్ట్రపతి ఎన్నికల్లో వాడడం లేదు
Also Read
Read Also:
Presidential Poll 2022: ద్రౌపది ముర్ము X యశ్వంత్ సిన్హా.. గెలుపెవరిది?
ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం, 1977లో ఈవీఎం మొదటిసారిగా రూపొందించబడింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్కు ఈవీఎంల రూపకల్పన, అభివృద్ధి బాధ్యత అప్పగించబడింది.ఈసీఐఎల్ 1979లో ఒక నమూనాను అభివృద్ధి చేసి ఈసీ ముందు ప్రదర్శించింది. దీనిని ఎన్నికల సంఘం ఆగస్టు 6, 1980న రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు ప్రదర్శించింది. ఈవీఎంలను ప్రవేశపెట్టడంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత వీటి తయారీ బాధ్యతను ఈసీఐఎల్తో పాటు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL)కు ఎన్నికల సంఘం అప్పగించింది.తదనంతరం, 1989లోఎన్నికలలో ఈవీఎంల వినియోగానికి సంబంధించిన నిబంధనను రూపొందించడానికి పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని సవరించింది.
మే, 1982లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ యంత్రాలను మొట్టమొదట ఉపయోగించారు. అయితే, దీని వినియోగాన్ని సూచించే నిర్దిష్ట చట్టం లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆ ఎన్నికలను కొట్టివేసింది. దీంతో ఈవీఎంల వినియోగానికి అనువుగా.. 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కు పార్లమెంట్ సవరణలు చేసింది. భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయ సాధన అనంతరం చాలా ఏళ్ల తర్వాత 1998లో తొలిసారి మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో వీటిని వినియోగించారు. 2001 మే నెలలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. అనంతరం 2004 లోక్సభ ఎన్నికల నుంచి వీటిని దేశవ్యాప్తంగా వినియోగించడం ప్రారంభించారు.
Read Also:
Presidential Poll 2022: నేడే రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!