Presidential Poll 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలు ఎందుకు వాడరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Presidential Poll 2022: దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?. మరి ఈ ఎన్నికల్లో ఈవీఎంలను ఎందుకు వాడరో చూద్దాం.
ఈవీఎంలు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓట్ల అగ్రిగేటర్గా పనిచేసే సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు వ్యతిరేకంగా బటన్ను నొక్కి, గరిష్ట సంఖ్యలో ఓట్లు సాధించిన వ్యక్తి ఎన్నికైనట్లు ప్రకటించబడతారు. సాధారణంగా లోక్సభ స్థానాలుకు గానీ, శాసనసభ స్థానాలకు ఓటర్లు అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. తమకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బటన్ను నొక్కి ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం అలా కుదరదు. ఓటింగ్లో పాల్గొనబోయే వ్యక్తి తన తొలి ప్రాధాన్య ఓటుతో పాటు రెండు, మూడు ప్రాధాన్య ఓట్లను కూడా వేయొచ్చు. 1, 2, 3.. ఇలా ఎంత మంది అభ్యర్థులు ఉంటే అంతమందికీ తన ప్రాధాన్య ఓటు వేయొచ్చు. అయితే, ఈవీఎంలలో ఈ ఏర్పాటు లేదు. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఈవీఎంలు రూపొందించాలి. అందుకనే వీటిని రాష్ట్రపతి ఎన్నికల్లో వాడడం లేదు
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
Read Also:
Presidential Poll 2022: ద్రౌపది ముర్ము X యశ్వంత్ సిన్హా.. గెలుపెవరిది?
ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం, 1977లో ఈవీఎం మొదటిసారిగా రూపొందించబడింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్కు ఈవీఎంల రూపకల్పన, అభివృద్ధి బాధ్యత అప్పగించబడింది.ఈసీఐఎల్ 1979లో ఒక నమూనాను అభివృద్ధి చేసి ఈసీ ముందు ప్రదర్శించింది. దీనిని ఎన్నికల సంఘం ఆగస్టు 6, 1980న రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు ప్రదర్శించింది. ఈవీఎంలను ప్రవేశపెట్టడంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత వీటి తయారీ బాధ్యతను ఈసీఐఎల్తో పాటు బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL)కు ఎన్నికల సంఘం అప్పగించింది.తదనంతరం, 1989లోఎన్నికలలో ఈవీఎంల వినియోగానికి సంబంధించిన నిబంధనను రూపొందించడానికి పార్లమెంటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951ని సవరించింది.
మే, 1982లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ యంత్రాలను మొట్టమొదట ఉపయోగించారు. అయితే, దీని వినియోగాన్ని సూచించే నిర్దిష్ట చట్టం లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆ ఎన్నికలను కొట్టివేసింది. దీంతో ఈవీఎంల వినియోగానికి అనువుగా.. 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కు పార్లమెంట్ సవరణలు చేసింది. భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయ సాధన అనంతరం చాలా ఏళ్ల తర్వాత 1998లో తొలిసారి మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో వీటిని వినియోగించారు. 2001 మే నెలలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో వీటిని ఉపయోగించారు. అనంతరం 2004 లోక్సభ ఎన్నికల నుంచి వీటిని దేశవ్యాప్తంగా వినియోగించడం ప్రారంభించారు.
Read Also:
Presidential Poll 2022: నేడే రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..