Presidential Poll 2022: ద్రౌపది ముర్ము X యశ్వంత్ సిన్హా.. గెలుపెవరిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Presidential Poll 2022: దేశంలో భారత 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈనెల 21న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గెలుపెవరిదనే ఉత్కంఠ నెలకొంది. ముర్ము విజయం ఖాయమైనా.. యశ్వంత్ సిన్హా గట్టి పోటీ అవకాశం ఉంది.
పార్లమెంట్, అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండడంతో వారి బ్యాలెట్లను గుర్తించేందుకు ఆకుపచ్చ, గులాబీ రంగులు గల బ్యాలెట్లను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఓటు వేశారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. లక్నోలో యూపీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులంతా ఎన్నికల సిబ్బంది ఇచ్చే ప్రత్యేక పెన్నుతోనే ఓటు వేయాలి. బ్యాలెట్ పత్రం ఆధారంగా జరిగే ఈ ఎన్నికలో వరుస క్రమంలో ద్రౌపదీ ముర్ము, యశ్వంత్ సిన్హా పేర్లు ఉండనున్నాయి. ఓటర్లు తాము ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పక్కన ప్రాధాన్య సంఖ్యను అంకెల రూపంలో వేయాల్సి ఉంటుంది.
Presidential Poll 2022 Live Updates : ఎప్పటికప్పుడు రాష్ట్రపతి ఎన్నికల సమగ్ర సమాచారం
ఎన్డీఏకు ఉన్న మద్దతు ప్రకారం ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపు దాదాపు ఖాయమే. భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలతోపాటు, బీజేడీ, వైకాపా, బీఎస్పీ, ఏఐఏడీఎంకె, జేడీఎస్, తెదేపా, అకాలీదళ్, శివసేన, జేఎంఎం పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు 60శాతానికి పైగా ఓట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 21న ఫలితం ప్రకటించిన తర్వాత దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్రకెక్కనున్నారు. ప్రస్తుతం నికరంగా 10.81 లక్షల ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే అభ్యర్థికి 6.66 లక్షల ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?