China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
- బ్రహ్మపుత్ర నదిపై చైనా మెగా డ్యామ్..
- భారత్కు తీవ్ర ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Mega Dam: భారత్కు ఎంతో కీలకమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మెగా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టిబెన్లోని యార్లుంగ్ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై డ్యామ్ నిర్మాణ పనుల్ని చైనా వేగం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ, జలవనరుల, వ్యూహాత్మక భద్రతపై ప్రభావం పడొచ్చని భారత్ భయపడుతోంది. యార్లుంగ్ సాంగ్పో టిబెట్లో పుట్టి, అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగా నదిగా ప్రవేశించి, ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది. ఇది అస్సాంతో పాటు దేశంలోనే అనేక కోట్ల మందికి జీవనధారగా ఉంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల భారత ప్రయోజనాలకు భగం కలిగే అవకాశం ఉంది.
చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్ వల్ల నది సహజ ప్రవాహంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. చైనా తనకు కావాల్సిన సమయంలో నది ప్రవాహాన్ని ఒక ఆయుధంగా భారత్పై వాడే అవకాశాలు లేకపోలేదు. దిగువ ప్రాంతాల్లో వరదలు లేదా కరువు పరిస్థితుల్ని సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నదీ ప్రవాహంపై చైనా పట్టు సాధిస్తే, ఎప్పుడైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే, ఈ నీటి ద్వారా భారత్ను నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి..
- PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- Gold Ring: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన బంగారపు ఉంగరం.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Taj Mahal: తాజ్మహల్పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
అయితే, చైనా మాత్రం భారత అభ్యంతరాలను లైట్ తీసుకుంటోంది. ఈ డ్యామ్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే అని, భారత్ సహా దిగువ ప్రాంత దేశాలకు ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గతంలో పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, 1986 లోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వెలుగులోకి వచ్చిందని చెప్పారు. దిగువ ప్రాంతాల్లో నివసించే భారతీయుల జీవనాధారం, భద్రతకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చైనాతో ఈ విషయాన్ని భారత్ చాలా సార్లు లేవనెత్తింది. 2006లో ఏర్పాటైన నిపుణుల కమిటీ ద్వారా సరిహద్దు నదుల అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Explainer: పాక్తో వేగలేం! పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
Hema Malini: డియోల్ కుటుంబంలో నిజంగానే విభేదాలున్నాయా? తొలిసారి స్పందించిన హేమా మాలిని..
-
Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Monsoon Health Alert: రెయిన్ అలర్ట్ అంటే హెల్త్ అలర్ట్ కూడా.. పిల్లలకు ఎక్కువగా వచ్చే వ్యాధులు ఇవే.. వైద్యుల హెచ్చరిక
ట్రెండింగ్
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!