Bihar CM: బీహార్ తదుపరి సీఎం ఎవరు? ఎక్స్ నుంచి జేడీయూ పోస్ట్ తొలగింపు!
- బీహార్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- ఎక్స్ నుంచి జేడీయూ కీలక పోస్ట్ తొలగింపు!
- బీహార్ తదుపరి సీఎం ఎవరు?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక ఢిల్లీ వేదికగా బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకోగా.. ఇటు బీహార్లో జేడీయూ కార్యకర్తలు కూడా వేడుకలు జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Terror Blast Case: ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం.. నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు
Also Read
- TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
- West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
- PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..
ఎన్డీఏ కూటమికి విజయమైతే దక్కింది గానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది సందిగ్ధం నెలకొంది. గత 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్స్లో పోస్ట్ చేసిన దాన్ని తొలగించడంతో కొత్త చర్చ మొదలైంది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక జేడీయూ ఎక్స్లో కీలక పోస్ట్ చేసింది. కానీ అంతలోనే తొలగించింది. దీంతో తదుపరి బీహార్ ముఖ్యమంత్రి ఎవరన్నది కొత్త చర్చ మొదలైంది.
ఎక్స్లో పోస్ట్ ఇదే..
‘‘నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందని.. ఈ విజయం అపూర్వమైనది.. సాటిలేనిది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.. తర్వాత కొనసాగుతారు.’’ అంటూ జేడీయూ ట్వీట్ చేసింది. కానీ కొన్ని క్షణాలకే పోస్టును జేడీయూ తొలగించింది. దీంతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి నితీష్ కుమార్ కాకుండా.. ఆ స్థానంలో కొత్త ఫేస్ రాబోతుందంటూ చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: Mehbooba Mufti: ఉగ్రవాది ఇంటిని పేల్చివేయడాన్ని ఖండిస్తున్నా.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం సంచలన ప్రకటన..
వాస్తవంగా బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్డీఏ కూటమి బరిలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలో ఒకసారి మోడీ మాట్లాడుతూ.. నితీష్ నేతృత్వంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కానీ మిగతా బీజేపీ నాయకులెవరూ కూడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు. గతేడాది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే బరిలోకి దిగారు. అప్పుడు ఏక్నాథ్షిండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తీరా ఎన్నికల్లో గెలిచాక షిండేను పక్కన పెట్టి.. దేవేంద్ర ఫడ్నవిస్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు బీహార్లో కూడా అదే జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక బీహార్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. జేడీయూ కంటే ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో కమలనాథుడే ఈసారి ముఖ్యమంత్రి అవ్వొచ్చని ఊహాగానాలు నడుస్తున్నాయి.

తాజావార్తలు
-
NSE Introduces Electronic Gold: డిజిటల్ యుగంలోకి బంగారం.. ఈజీఆర్లను ప్రవేశపెట్టిన NSE..
-
TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న 3 మార్గాలివే!
-
Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్
-
Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!
-
West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!