Maharashtra Politics: సునేత్ర పవార్ వర్సెస్ సుప్రియా సూలే.. పవార్ కుటుంబంలో అతివల రాజకీయ యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఈసీ, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్దే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రస్తుతం బారామతి ఎంపీగా ఉన్న సుప్రియా సులేపై అజిత్ పవార్ సునేత్ర పవార్ని పోటీలో దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బారామతి వ్యాప్తంగా సునేత్రా పవార్ పోస్టర్లు ఈ పోటీని స్పష్టం చేస్తున్నాయి. 2024 ఎంపీ ఎన్నికల్లో సునేత్ర బారామతి నుంచి పోటీ చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన కజిన్ సుప్రియా సూలేని ఓడించేందుకు అజిత్ పవార్ పావులు కదుపుతున్నారు. సునేత్ర పేరును నేరుగా వెల్లడించకుండా.. ఈ సారి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ‘‘ఫస్ట్ టైమర్’’ని ఎన్నుకోవాలని బారామతి ఓటర్లను ఆయన వేడుకున్నారు. 5 దశాబ్ధాలుగా బారామతి ఎన్సీపీ, పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది.
Also Read
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
మరోవైపు ఈ పోటీపై సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. నియోజకవర్గంలో ప్రజలను భావోద్వేగానికి గురిచేయడానికి అజిత్ పవార్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుటుంబంలో తాన ఒంటరయ్యానని చెప్పడం ద్వారా అతను ప్రజల్ని భావోద్వేగానికి గురిచేస్తున్నాడని విమర్శించారు.
సునేత్ర పవార్ ఎవరు..?
సునేత్ర పవార్ అజిత్ పవార్ భార్యగా, బారామతిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఎన్విరాన్మెంట్ ఫోర్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. ఆమె శరద్ పవార్కి అత్యంత సన్నిహితుడైన పదమ్ సిన్హ్ పాటిల్ సోదరి. ఇదే కాకుండా సునేత్రా సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించడానికి విస్తృతంగా పనిచేశారు. ప్రముఖ విద్యాసంస్థ విద్యా ప్రతిష్టాన్కి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు ఆమె బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక నాయకులతో టచ్లో ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో సుప్రియా సూలేపై బీజేపీ తరుపున పోటీ చేసిన కంచన్ కుల్ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
55 ఏళ్లుగా బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. శరద్ పవార్ 1967లో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి గెలుపొందారు. 1972, 1978, 1980, 1985 మరియు 1990 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1984, 1996, 1998, 1999, 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత విజయం సాధించారు.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!