Shweta K Sugathan: రిపబ్లిక్ డే రోజున “మహిళా పోలీస్ మార్చ్”కి స్వేత కే సుగతన్ నాయకత్వం.. ఈమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shweta K Sugathan: భారతదేశ గణతంత్ర వేడుకుల పరేడ్ చరిత్రంలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులు ఉండబోతున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్, పోలీస్-II అడిషనల్ డిప్యూటీ కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి శ్వేతా కే సుగతన్ ఈ పరేడ్ని నాయకత్వం వహించనున్నారు. 75వ రిపబ్లిక్ డే పరేడ్కి ఓ మహిళా అధికారి ఇలా నేతృత్వం వహించనున్నారు.
ఢిల్లీ పోలీస్కి చెందిన 194 మంది మహిళా అధికారులు కర్తవ్య మార్గ్లో కవాతు చేయనున్నారు. నివేదిక ప్రకారం.. ఈ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటున్న వారిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల అసమానతలను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి పోలీసులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని కలిగి ఉన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Amarnath: నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు
కిరణ్ బేడీ తర్వాత శ్వేత కే సుగతన్:
గతేడాది శ్వేతా కే సుగతన్ రిపబ్లిక్ డే కంటెంజెంట్లో కూడా ఢిల్లీ పోలీసు బృందానికి (పురుష మరియు మహిళా అధికారులతో కూడిన) నాయకత్వం వహించారు. 48 ఏళ్ల చరిత్రలో ఇలా నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఈమె నిలిచారు. కిరణ్ బేడీ తర్వాత ఢిల్లీ పోలీస్ దళానికి నేతృత్వం వహించిన మహిళా కమాండర్గా నిలిచారు.
ఢిల్లీ పోలీసులు 1955లో మొదటిసారిగా రాజ్పథ్(కర్తవ్య మార్గ్)లో కవాతు చేశారు. 1975లో కిరణ్ బేడీ నాయకత్వం వహించి తొలి మహిళగా నిలిచారు. దాదాపు 5 దశాబ్ధాల తర్వాత శ్వేతా కే సుగతన్ వచ్చారు. 955 నుండి, ఢిల్లీ పోలీసులు 26 జనవరి పరేడ్లో 40 సార్లు బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును అందుకున్నారు.
ఎవరీ శ్వేతా కే సుగతన్.?
శ్వేతా కె సుగతన్ గత ఏడాది అక్టోబర్లో ఢిల్లీ పోలీసు అదనపు డిసిపి-II ఉత్తర జిల్లాగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆమె చాణక్యపురిలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. శ్వేత సొంత రాష్ట్రం కేరళ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క 2019 AGMUT కేడర్కు చెందినవారు. సుగతన్ 2015లో డిగ్రీ పట్టా పొందారు. 2019లో యూపీఎస్సీ పరీక్షని క్లీయర్ చేసి ఐపీఎస్ అయ్యారు. తొలుత చాణక్య పురిలో ఏసీపీగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?