Shweta K Sugathan: రిపబ్లిక్ డే రోజున “మహిళా పోలీస్ మార్చ్”కి స్వేత కే సుగతన్ నాయకత్వం.. ఈమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shweta K Sugathan: భారతదేశ గణతంత్ర వేడుకుల పరేడ్ చరిత్రంలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులు ఉండబోతున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్, పోలీస్-II అడిషనల్ డిప్యూటీ కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి శ్వేతా కే సుగతన్ ఈ పరేడ్ని నాయకత్వం వహించనున్నారు. 75వ రిపబ్లిక్ డే పరేడ్కి ఓ మహిళా అధికారి ఇలా నేతృత్వం వహించనున్నారు.
ఢిల్లీ పోలీస్కి చెందిన 194 మంది మహిళా అధికారులు కర్తవ్య మార్గ్లో కవాతు చేయనున్నారు. నివేదిక ప్రకారం.. ఈ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటున్న వారిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల అసమానతలను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి పోలీసులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని కలిగి ఉన్నారు.
Also Read
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
Read Also: Amarnath: నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు
కిరణ్ బేడీ తర్వాత శ్వేత కే సుగతన్:
గతేడాది శ్వేతా కే సుగతన్ రిపబ్లిక్ డే కంటెంజెంట్లో కూడా ఢిల్లీ పోలీసు బృందానికి (పురుష మరియు మహిళా అధికారులతో కూడిన) నాయకత్వం వహించారు. 48 ఏళ్ల చరిత్రలో ఇలా నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా ఈమె నిలిచారు. కిరణ్ బేడీ తర్వాత ఢిల్లీ పోలీస్ దళానికి నేతృత్వం వహించిన మహిళా కమాండర్గా నిలిచారు.
ఢిల్లీ పోలీసులు 1955లో మొదటిసారిగా రాజ్పథ్(కర్తవ్య మార్గ్)లో కవాతు చేశారు. 1975లో కిరణ్ బేడీ నాయకత్వం వహించి తొలి మహిళగా నిలిచారు. దాదాపు 5 దశాబ్ధాల తర్వాత శ్వేతా కే సుగతన్ వచ్చారు. 955 నుండి, ఢిల్లీ పోలీసులు 26 జనవరి పరేడ్లో 40 సార్లు బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డును అందుకున్నారు.
ఎవరీ శ్వేతా కే సుగతన్.?
శ్వేతా కె సుగతన్ గత ఏడాది అక్టోబర్లో ఢిల్లీ పోలీసు అదనపు డిసిపి-II ఉత్తర జిల్లాగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆమె చాణక్యపురిలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. శ్వేత సొంత రాష్ట్రం కేరళ. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ యొక్క 2019 AGMUT కేడర్కు చెందినవారు. సుగతన్ 2015లో డిగ్రీ పట్టా పొందారు. 2019లో యూపీఎస్సీ పరీక్షని క్లీయర్ చేసి ఐపీఎస్ అయ్యారు. తొలుత చాణక్య పురిలో ఏసీపీగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!