Pratap Sarangi: రాహుల్ గాంధీ గాయపరిచిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఎవరు..?
- అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- బీజేపీ ఎంపీపై రాహుల్ గాంధీ దాడి చేసినట్లు ఆరోపణ..
- ఎవరు ఈ ప్రతాప్ చంద్ర సారంగి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pratap Sarangi: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరనసలు ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంట్ ఆవరణ ముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని నెట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతాప్ సారంగి మెట్లపై పడటంతో ఆయన తనకు గాయాలయ్యాయి.
ప్రతాప్ చంద్ర సారంగి ఎవరు..?
Also Read
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశాకు చెందిన ప్రముఖ బీజేపీ నేత. బాలాసోర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బాలాసోర్లోని గోపీనాథ్పూర్ గ్రామంలో జనవరి 4, 1955లో జన్మించారు. 1975లో ఉత్కల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫకీర్ మోహన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. సారంగి రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా మొదలైంది. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్ దళ్లో పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు ఒడిశాలోని నీలగిరి అసెంబ్లీ నుంచి రాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు.
2019లో ఎంపీగా పోటీచేసి బీజేడీ ఎంపీ రవీంద్రకుమార్ జెనాపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో సారంగి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
1999లో ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతడి ఇద్దరు కుమారులను హత్య చేయడంతో సారంగి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. 2002లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీపై దాడి జరిగిన తర్వాత అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో సారంగిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సారంగి జబరంగ్ దళ్కు చీఫ్గా ఉన్నారు. సంస్థతో సంబంధం ఉన్న గుంపు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేరానికి గానూ సారంగి, మరో 10 మందికి మొదటి దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఒడిశా హైకోర్టు తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?