Pratap Sarangi: రాహుల్ గాంధీ గాయపరిచిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఎవరు..?
- అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- బీజేపీ ఎంపీపై రాహుల్ గాంధీ దాడి చేసినట్లు ఆరోపణ..
- ఎవరు ఈ ప్రతాప్ చంద్ర సారంగి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pratap Sarangi: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరనసలు ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంట్ ఆవరణ ముందు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని నెట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతాప్ సారంగి మెట్లపై పడటంతో ఆయన తనకు గాయాలయ్యాయి.
ప్రతాప్ చంద్ర సారంగి ఎవరు..?
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశాకు చెందిన ప్రముఖ బీజేపీ నేత. బాలాసోర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బాలాసోర్లోని గోపీనాథ్పూర్ గ్రామంలో జనవరి 4, 1955లో జన్మించారు. 1975లో ఉత్కల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫకీర్ మోహన్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. సారంగి రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ వాలంటీర్గా మొదలైంది. ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్ దళ్లో పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు ఒడిశాలోని నీలగిరి అసెంబ్లీ నుంచి రాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు.
2019లో ఎంపీగా పోటీచేసి బీజేడీ ఎంపీ రవీంద్రకుమార్ జెనాపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో సారంగి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
1999లో ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, అతడి ఇద్దరు కుమారులను హత్య చేయడంతో సారంగి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. 2002లో ఒడిశా రాష్ట్ర అసెంబ్లీపై దాడి జరిగిన తర్వాత అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో సారంగిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సారంగి జబరంగ్ దళ్కు చీఫ్గా ఉన్నారు. సంస్థతో సంబంధం ఉన్న గుంపు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేరానికి గానూ సారంగి, మరో 10 మందికి మొదటి దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఒడిశా హైకోర్టు తర్వాత వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..