Arvind Kejriwal: ‘‘నేను జైలుకు తిరిగి వెళ్లాలా..? వద్దా..?’’ అంతా మీ చేతుల్లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఓటేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. పంజాబ్ రాజధాని అమృత్సర్లో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కోసం ప్రచారం చేశారు. లోక్సభలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దర్దు చేస్తారని ఆప్ ఆధినేత ఆరోపించారు. బీజేపీ నేతలు తాను 20 రోజుల తర్వాత జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారని, నేను తిరిగి జైలుకు వెళ్లాలా..? వద్దా..? అనేది త మీపై ఆధారపడి ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుకు ఓటేస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మీరు ఓటేసేటప్పుడు కేజ్రీవాల్ స్వేచ్ఛ కోసం వేస్తున్నట్లు గుర్తుంచుకోండని సూచించారు. పెద్ద నాయకులను జైల్లో పెట్టారు.. కానీ జైలు మాకు సమస్య కాదు.. మాకు దేశం, రాజ్యాంగం సర్వోన్నతమని ఆయన అన్నారు.
Read Also: Fake Reviews: ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో నకిలీ సమీక్షలను నిరోధించడానికి సిసిపిఎ త్వరలో చర్యలు..
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి, తీహార్ జైలుకు తరలించింది. 50 రోజుల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం మే 10న విడుదలైన కేజ్రీవాల్, జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నట్లు ఈడీ ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం నిరాకరించింది. ఈడీ తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రజలు ఆప్కి ఓటేస్తే జూన్ 2 తర్వాత జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎన్నికల ర్యాలీలో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!