Nirmala Sitharaman: రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?
- కళ్లకురిచి కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం..
- రాహుల్ గాంధీ
- ఖర్గే ఎక్కడ..?
- దళితులు చనిపోయినా పట్టించుకోరా..?
- తమిళనాడు ఘటనపై నిర్మలా సీతారామన్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kallakurichi hooch tragedy: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.
ఇంతపెద్ద సంఘటన జరిగినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 200 మందికి పైగా ప్రజల పరిస్థితి విషమంగా ఉంది. 56 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నారు. ‘టాస్మాక్’ అని పేరుతో ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల నుంచి లైసెన్సులు పొందిన మద్యం దుకాణాల మందుతాగి వారు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది..’’ అని ఆమె అన్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
కళ్లకురిచిలో కెమికల్ ఆధారిత కల్తీ మద్యం తయారుచేస్తున్నారని, కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో దళితులు చనిపోతున్నా రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. తమిళనాడులో ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి. ఈ విషయంలో నోరు మొదపని ఇండియా కూటమి నేతలు కనీసం పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద మరణించిన వారి పట్ల గౌరవంగా మౌనం కూడా పాటించలేదని బీజేపీ మండిపడింది.
‘‘ 56 మంది చనిపోయారు. చాలా మంది క్రిటికల్గా ఉన్నారు. చనిపోయిన వారిలో 40 మందికి పైగా దళితులే ఉన్నారని, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, డీఎంకే నేతలు, ఇండియా కూటమి పార్టీలు దీనిపై మౌనంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి గోకుల్దాస్ నేతృత్వంలో విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నారు.
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!