CM Yogi: ‘‘ మీ ఇంటిని కాల్చి, మీ తల్లిని ఇస్లామిక్ మిలీషియా చంపడం మరిచిపోయారా ఖర్గే జీ?’’
- కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి చరిత్ర గుర్తు చేసిన సీఎం యోగి..
- మీ ఇంటిని తగలబెట్టిన విషయం మరిచారా..?
- కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం కుటుంబ త్యాగాన్ని మరిచారంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
‘‘ బ్రిటీష్ హయాంలో, అప్పటి రాజరిక రాష్ట్రం హైదరాబాద్లోని ఒక గ్రామంలో ఖర్గే ఇంటిని ఇస్లామిక్ మిలీషియా దహనం చేయడంతో ఆతడి తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. ఖర్గే తన భావాలను దాచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తున్నారు’’ అని యోగి అన్నారు. ‘‘ఖర్గేకి నాపై కోపం ఉంది. కానీ యోగికి దేశం ముందుంటుంది. మీకు మాత్రం కాంగ్రెస్ని బుజ్జగించడమే ప్రధానం’’ అని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Indira Eegalapati : సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపనున్న హైదరాబాద్ మహిళ
‘‘ఖర్గే గ్రామం నిజాం పాలనలోని హైదరాబాద్లో ఉండేది. భారతదేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు, హిందువులను టార్గెట్ చేసి చంపుతున్న సమయంలో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు. తన తల్లి, కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ విషయం ఖర్గేకి తెలుసు కానీ ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని మరిచిపోయారు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
అంతకుముందు, ఆదివారం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బాటేంగే తో కటేంగే’’ అనే యోగి నినాదాన్ని విమర్శించారు. “చాలా మంది (రాజకీయ) నాయకులు సాధువుల వేషధారణలో బతుకుతూ రాజకీయ నాయకులు అవుతారు.. కొందరు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. గెరువ (కుంకుమ) బట్టలు వేసుకుంటారు, తలపై వెంట్రుకలు కూడా ఉండవు… తెల్లని బట్టలు ధరించి, సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో” అంటూ ఖర్గే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
హిందువులు విడిపోతే, నాశనం అవుతారని యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులను ఉద్దేశిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఈ నినాదం వైరల్గా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ నినాదం సంచలనంగా మారింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!