CM Yogi: ‘‘ మీ ఇంటిని కాల్చి, మీ తల్లిని ఇస్లామిక్ మిలీషియా చంపడం మరిచిపోయారా ఖర్గే జీ?’’
- కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకి చరిత్ర గుర్తు చేసిన సీఎం యోగి..
- మీ ఇంటిని తగలబెట్టిన విషయం మరిచారా..?
- కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం కుటుంబ త్యాగాన్ని మరిచారంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.
‘‘ బ్రిటీష్ హయాంలో, అప్పటి రాజరిక రాష్ట్రం హైదరాబాద్లోని ఒక గ్రామంలో ఖర్గే ఇంటిని ఇస్లామిక్ మిలీషియా దహనం చేయడంతో ఆతడి తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. ఖర్గే తన భావాలను దాచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తున్నారు’’ అని యోగి అన్నారు. ‘‘ఖర్గేకి నాపై కోపం ఉంది. కానీ యోగికి దేశం ముందుంటుంది. మీకు మాత్రం కాంగ్రెస్ని బుజ్జగించడమే ప్రధానం’’ అని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
Read Also: Indira Eegalapati : సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపనున్న హైదరాబాద్ మహిళ
‘‘ఖర్గే గ్రామం నిజాం పాలనలోని హైదరాబాద్లో ఉండేది. భారతదేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు, హిందువులను టార్గెట్ చేసి చంపుతున్న సమయంలో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు. తన తల్లి, కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ విషయం ఖర్గేకి తెలుసు కానీ ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని మరిచిపోయారు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
అంతకుముందు, ఆదివారం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బాటేంగే తో కటేంగే’’ అనే యోగి నినాదాన్ని విమర్శించారు. “చాలా మంది (రాజకీయ) నాయకులు సాధువుల వేషధారణలో బతుకుతూ రాజకీయ నాయకులు అవుతారు.. కొందరు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. గెరువ (కుంకుమ) బట్టలు వేసుకుంటారు, తలపై వెంట్రుకలు కూడా ఉండవు… తెల్లని బట్టలు ధరించి, సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో” అంటూ ఖర్గే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
హిందువులు విడిపోతే, నాశనం అవుతారని యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులను ఉద్దేశిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఈ నినాదం వైరల్గా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ నినాదం సంచలనంగా మారింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!