* తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. కొంగరకలాన్లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పార్క్.. పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న చైనా కంపెనీ.. ఇవాళ ప్రకటన
* హైదరాబాద్: ఇవాళ నందమూరి తారకరత్న సంతాప సభ
* గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, నేతలు
* మెడికో ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ను నేడు కస్టడీలోకి తీసుకున్న వరంగల్ పోలీసులు..
* నేడు హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో టీవర్క్స్ ప్రారంభం.. రూ.100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
* అబ్దుల్లాపూర్మెట్ దగ్గర నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ పోలీస్ కస్టడీపై నేడు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు
* నేడు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటలకు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మూడు రాష్ట్రాల్లో 85 శాతం, అంతకు మించిన ఓటింగ్ శాతం నమోదు.
* నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను, “త్రిణమూల్ కాంగ్రెస్” 28 స్థానాల్లో పోటీ చేయగా, “తిప్రా మోతా పార్టీ” 42 శాసన సభా స్థానాల్లో పోటీ. వామపక్ష కూటమి 47 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో పోటీ.. బీజేపీ 55 స్థానాల్లో పోటీ.. త్రిపురలో మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు.
* నేడు మేఘాలయ అసెంబ్లీ ఫలితాలు.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాలకు ఎన్నికలు.
* నేడు నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..ఎన్.డి.పి.పి 40 స్థానాలు, బిజెపి 20 స్థానాల్లో పోటీ. ఒక స్థానంలో బిజెపి పోటీ లేకుండానే గెలుపు.. 23 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.
* విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. ముఖ్యమంత్రి సమక్షంలో రెండు రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. సీఎం పర్యటన, GIS అతిథులు రాకతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. నేటి సాయంత్రం ఎయిర్పోర్ట్ నుంచి తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫైఓవర్, కురుపాం జంక్షన్ మీదుగా హోటల్ కు చేరుకోనున్న సీఎం.. రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి
* ప్రకాశం : గిద్దలూరు మండలం నరవలో ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు..
* ప్రకాశం : మర్రిపూడి లోని పృదులాపురి కొండపై రెండవ రోజు శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలి వస్తున్న భక్తులు..
* విశాఖ: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సన్నద్ధమైంది వైద్య ఆరోగ్యశాఖ.. 30 మంది డాక్టర్లు, 200 మంది సిబ్బందితో బృందాలు.. సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు.. GIS అతిథులు బస చేస్తున్న హోటళ్ల దగ్గర అంబులెన్స్, వైద్యబృందాలు .
* తిరుమల:రేపటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఐదు రోజులు పాటు స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించనున్న టిటిడి.. రేపటి నుంచి ఐదు రోజులు పాటు తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్న అర్చకులు.. ఐదు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టిటిడి
* శ్రీ సత్యసాయి :నేటి నుంచి కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరహింహాస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈనెల 3వ తేదీ శ్రీవారి కళ్యాణోత్సవం.13న బ్రహ్మరథోత్సవం.
* నేటి నుంచి నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* నెల్లూరు: బోగోలు మండలంలోని బిలకూట క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
* గుంటూరు : వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ ల లోని 130 పోస్టుల భర్తీకి నేడు గుంటూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు…
* బాపట్ల : నేడు అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో పర్యటించనున్న మేరుగ నాగార్జున..
* గుంటూరు : నేడు తెనాలిలో పర్యటించనున్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..
* తిరుపతి: నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. గుమ్మడివారి ఇండ్లు (విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.. పోలవరపు ఇండ్లు, దామలచెరువు, కొండేపల్లి క్రాస్, మొగరాల మీదుగా కొమ్మురెడ్డి పల్లి వరకు సాగనున్న పాదయాత్ర..
* కడప : జిల్లా సర్వజన ఆసుపత్రిలో నేటి నుంచి 7వ తేదీ వరకు మహిళల గర్భ కోశ క్యాన్సర్ పై స్క్రీనింగ్ పరీక్షలు..