* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్
* నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
* నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్, రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గాను 1,150కుపైగా దాఖలైన బిడ్లు
* కాకినాడ: నేడు సత్యదేవునికి వక్రకిరీటం అలంకరణ, నేడు రెండో రోజు సత్యదేవుని 132వ ఆవిర్భావ వేడుకలు
* నేడు సాయిప్రియ భర్త శ్రీనివాస్ను పోలీస్ స్టేషన్కు పిలవనున్న పోలీసులు.. నిన్న పోలీసులను ఆశ్రయించిన సాయిప్రియ..
* నేడు అన్నవరం సత్యదేవుని దర్శించుకోనున్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు
* తిరుమల: ఎల్లుండి ఆన్ లైన్ లో పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ, 2500 రూపాయల చొప్పున 600 టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* అనకాపల్లి: పూడి మడక బీచ్ లో గల్లంతు అయినా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
* హైదరాబాద్: నేడు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను పరిశీలించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మధ్యాహ్నం 12.30 కి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తు … ప్రధాని మోడీ కార్యక్రమంలో కందుకూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొననున్న కిషన్ రెడ్డి