What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: నేడు రాజధాని ప్రాంతం అనంతవరంలో వనమహోత్సవం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంతవరం పార్క్లో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం
* నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం.. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన.. బనకచర్ల, కాళేశ్వరం పై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధాన చర్చ.. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే ఛాన్స్
Also Read
* అమరావతి: ఏపీ వ్యాప్తంగా బీజేపీ పర్యావరణ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని బీజేపీ శ్రేణులకు ఆదేశాలు.. జిల్లాల వారీగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని దిశానిర్దేశం.. నర్సరీల నుంచీ ఇప్పటికే మొక్కలు రప్పించిన అన్ని జిల్లాల బీజేపీ నాయకులు
* అమరావతి : పదవ తరగతి మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… నేడు వైసీపీ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పాఠశాల విద్యా కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పణ
* తిరుమల: 9వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఏపీ పేపర్ మిల్లు అంశంపై రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు గారి అధ్యక్షతన జరుగనున్న సమావేశం
* అనంతపురం : నార్పల మండల కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమం లో పాల్గొననున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి..
* అమరావతి: ఏపీ హైకోర్టులో నేడు వల్లభనేని వంశీ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ.. వైద్యం చేయించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సరిగా చేయలేదని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్.. నేడు విచారణ జరపనున్న వెకేషన బెంచ్
* అమరావతి: పల్నాడు జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి బ్రదర్స్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. కావాలని తమను స్థానిక ఎమ్మెల్యే కేసులో ఇరికించారని పిటిషన్
* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ8 చాణక్య బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
* కృష్ణా: నేటి నుంచి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్.. ఇవాళ్టి నుంచి 4 రోజులపాటు జరగనున్న ఫెస్టివల్
* అనంతపురం : నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీ. ఆత్మకూరు మండలం పంపనూరులో విత్తన పంపిణీని ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్.
* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ బాలాజీ దేవాలయంలో 15వ వార్షికోత్సవం పురస్కరించుకొని స్వామి వారి కల్యాణోత్సవం
* నంద్యాల: నేడు నందికొట్కూరు మం అల్లూరులో నూతన సబ్ స్టేషన్ కు భూమి పూజ చేయనున్న ఎమ్మెల్యే జయసుర్య..
* నేడు మెదక్ జిల్లాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన.. చిన్నశంకరంపేటలోని ఆ ఆలయ వేడుకల్లో పాల్గొననున్న ఎంపీ
* నిజమాబాద్ జిల్లాలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన.. నందిపేట మండలం సి.హెచ్ కొండూరు లో లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న కవిత.. జిల్లాలో మూడు రోజుల పాటు బస చేయనున్న జాగృతి అధ్యక్షురాలు.
* హైదరాబాద్: రేపు లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు.. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షలు.. 76 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.. హాజరుకానున్న 57,715 మంది అభ్యర్థులు..
* తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,288 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,079 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు
* గుంటూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు గుంటూరులో పర్యావరణంపై అవగాహన ర్యాలీ, మొక్కలు నాటనున్న ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అహ్మద్.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?