* IPL: ఇవాళ గుజరాత్ వర్సెస్ కోల్కతా.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు గుజరాత్-కోల్కతా మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఇవాళ లోక్సభలో మూడు బిల్లులపై చర్చ.. మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్.. ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి.. మోడీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ
* రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు.. ఇవాళ సాయంత్రం స్పష్టంకానున్న బిల్లుల భవితవ్యం.. మధ్యాహ్నం 3 గంటలకు సమాధానం ఇవ్వనున్న అమిత్షా.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో బిల్లులపై ఓటింగ్..
* అమరావతి: ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. పార్టీ అధినేతతో భేటీకానున్న నూతనంగా ఎన్నికైన కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు..
* ఇవాళ ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్ శాఖలో వివిధ అంశాలపై పవన్ కల్యాణ్ సమీక్ష..
* బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణలో ఆందోళనలు.. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నిరసనలు.. గన్పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతల ఆందోళన.. అన్ని పీఎస్లలో తేజస్విపై ఫిర్యాదు చేయాలని నిర్ణయం.. భారత్-పాకిస్తాన్ విభజనతో ఏపీ-తెలంగాణ విభజనను పోల్చిన తేజస్వి
* తిరుమల: రేపటి నుంచి ఆన్లైన్లో జులై నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు
* ఖమ్మం: నేడు ఖమ్మంలో రోడ్డు భద్రత ప్రభుత్వం ఆ చికిత్స అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్
* నేడు కరీంనగర్ లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన.. పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న డీజీపీ.. రోడ్డు భద్రత వారోత్సవాలలో పాల్గొననున్న రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి..