PM Modi: గత 10 ఏళ్లు కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు కథ ముందుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గత పదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మూడో సారి గెలిచిన తర్వాత అసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని, హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. గురువారం బీహార్ రాష్ట్రంలోని జముయ్లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. బీజేపీ, ఎన్డీయేలకు అనుకూల పవనాలు బీహార్లో మాత్రమే కాదని, దేశంలో మారుమూల అంతా వినిపిస్తున్నాయని ప్రధాని చెప్పారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన చెప్పారు.
Read Also: Congress: కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ప్రతిపక్ష ఇండియా కూటమిపై విమర్శలు గుప్పిస్తూ.. రైల్వేలో పేదలకు ఉద్యోగాలు ఇపిస్తానమని భూముల్ని కాజేసే వారు బీహార్ ప్రజలకు ఎప్పటికీ మేలు చేయలేరని మండిపడ్డారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో వందేభారత్ వంటి అధునాతన రైళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచ దృష్టిలో భారత్ బలహీన దేశంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచ నాయకుడిగా ఎదిగిందని మోడీ అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో దేశ ప్రతిష్ట మసకబారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశాన్ని బలహీన, పేద దేశంగా భావించారు. ఈ రోజు ప్రపంచానికి భారత్ దారి చూపించే స్థితికి ఎదిగిందని చెప్పారు.
భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు మాజీ సీఎం, భారతరత్న కర్పూరీ ఠాకూర్తో సహా రాష్ట్ర ప్రముఖుల్ని అవమానించాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో 500 ఏళ్ల రామమందిర కల నెరవేరిందని, రామ మందిర నిర్మాణాన్ని ఆపేందుకు కాంగ్రెస్, ఆర్జేడీలు ప్రయత్నించాయని మోడీ ఆరోపించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!