Supreme Court: అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారం ఉంది..? హిండెన్బర్గ్ కేసులో సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
ఈ వ్యవహారంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో ముడిపడి ఉన్న కేసులో పిటిషనర్లను ఘాటుగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ‘‘మేము విదేశీ నివేదికను ఎందుకు నిజం చేయాలి..? మేము నివేదికను తిరస్కరించడం లేదు, కానీ మాకు రుజువులు కావాలి. మీ దగ్గర అదానీ గ్రూపుకు వ్యతిరేకం ఏం ఆధారాలు ఉన్నాయి..?’’ అని భారత ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ని ప్రశ్నించారు.
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(OCCRP), ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని తప్పుపట్టింది. మెరిట్ లెస్ హిండెన్బర్గ్ నివేదికను పునరుద్ధరించడానికి జార్జ్ సోరోస్ నిధులతో నడిచే విదేశీ మీడియా విభాగం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది.
Read Also: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
సెబీ కూడా ఈ నివేదిక నమ్మదగినదిగా లేదని తోసిపుచ్చింది. ‘‘ ఇలాంటి నివేదికపై స్పందిస్తే, మన ఏజెన్సీలే ఏమి చేయాలి..? విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలనున ప్రభావితం చేసే ట్రెండ్ నడుస్తోంది’’ అని సెబీ తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
హిండెన్బర్గ్ నివేదిక రావడానికి ముందు మరియు తర్వాత ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసులను సెబీ పూర్తి చేసిందని, మిగిలిన రెండింటి కోసం విదేశాల్లోని ఏజెన్సీల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని మెహతా చెప్పారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!