Supreme Court: అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారం ఉంది..? హిండెన్బర్గ్ కేసులో సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
ఈ వ్యవహారంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో ముడిపడి ఉన్న కేసులో పిటిషనర్లను ఘాటుగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ‘‘మేము విదేశీ నివేదికను ఎందుకు నిజం చేయాలి..? మేము నివేదికను తిరస్కరించడం లేదు, కానీ మాకు రుజువులు కావాలి. మీ దగ్గర అదానీ గ్రూపుకు వ్యతిరేకం ఏం ఆధారాలు ఉన్నాయి..?’’ అని భారత ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ని ప్రశ్నించారు.
Also Read
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(OCCRP), ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని తప్పుపట్టింది. మెరిట్ లెస్ హిండెన్బర్గ్ నివేదికను పునరుద్ధరించడానికి జార్జ్ సోరోస్ నిధులతో నడిచే విదేశీ మీడియా విభాగం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది.
Read Also: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
సెబీ కూడా ఈ నివేదిక నమ్మదగినదిగా లేదని తోసిపుచ్చింది. ‘‘ ఇలాంటి నివేదికపై స్పందిస్తే, మన ఏజెన్సీలే ఏమి చేయాలి..? విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలనున ప్రభావితం చేసే ట్రెండ్ నడుస్తోంది’’ అని సెబీ తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
హిండెన్బర్గ్ నివేదిక రావడానికి ముందు మరియు తర్వాత ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసులను సెబీ పూర్తి చేసిందని, మిగిలిన రెండింటి కోసం విదేశాల్లోని ఏజెన్సీల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని మెహతా చెప్పారు.
తాజావార్తలు
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
-
CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!