Supreme Court: అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారం ఉంది..? హిండెన్బర్గ్ కేసులో సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
ఈ వ్యవహారంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో ముడిపడి ఉన్న కేసులో పిటిషనర్లను ఘాటుగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ‘‘మేము విదేశీ నివేదికను ఎందుకు నిజం చేయాలి..? మేము నివేదికను తిరస్కరించడం లేదు, కానీ మాకు రుజువులు కావాలి. మీ దగ్గర అదానీ గ్రూపుకు వ్యతిరేకం ఏం ఆధారాలు ఉన్నాయి..?’’ అని భారత ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ని ప్రశ్నించారు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(OCCRP), ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని తప్పుపట్టింది. మెరిట్ లెస్ హిండెన్బర్గ్ నివేదికను పునరుద్ధరించడానికి జార్జ్ సోరోస్ నిధులతో నడిచే విదేశీ మీడియా విభాగం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది.
Read Also: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
సెబీ కూడా ఈ నివేదిక నమ్మదగినదిగా లేదని తోసిపుచ్చింది. ‘‘ ఇలాంటి నివేదికపై స్పందిస్తే, మన ఏజెన్సీలే ఏమి చేయాలి..? విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలనున ప్రభావితం చేసే ట్రెండ్ నడుస్తోంది’’ అని సెబీ తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
హిండెన్బర్గ్ నివేదిక రావడానికి ముందు మరియు తర్వాత ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసులను సెబీ పూర్తి చేసిందని, మిగిలిన రెండింటి కోసం విదేశాల్లోని ఏజెన్సీల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని మెహతా చెప్పారు.
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?