Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: జమ్మూ కాశ్మీర్లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
కీలక ఉగ్రవాది కారీని హతం చేయడం ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బగా ద్వివేది పేర్కొన్నారు. మేము మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిలో కొందరు రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఇలా సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ సైనికలు ఉన్నారని తెలిపారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో 20-25 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సహకారంతో గత ఏడాదిగా ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని అన్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్
తమ ఆర్మీ సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా భయంకరమైన ఉగ్రవాదుల్ని హతమార్చాని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇతర దేశాల్లో ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందటం వల్ల ఆపరేషన్కి సమయం పడుతోందని, మన ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాజౌరీ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఎన్కౌంటర్ 24 గంటల పాటు సాగింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లతో సహా మొత్తం ఐదుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఇద్దరు కీలక ఉగ్రవాదుల్ని హతమార్చారు.
ఉగ్రవాదులు పీఓకే, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న అటవులను , పీర్ పంజాల్ కొండలను ఆసరాగా చేసుకుని భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జమ్మూలోని రాజౌరీ, పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఉగ్రవాద చర్యలు పెరిగాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని కొండలు, అడవులు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపించాలని ప్రయత్నిస్తోంది. మన సైన్యం ఎప్పటికప్పుడు వీరిని నిర్మూలిస్తోంది.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!