Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: జమ్మూ కాశ్మీర్లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
కీలక ఉగ్రవాది కారీని హతం చేయడం ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బగా ద్వివేది పేర్కొన్నారు. మేము మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వారిలో కొందరు రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఇలా సరిహద్దు దాటుతున్న ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ సైనికలు ఉన్నారని తెలిపారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో 20-25 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సహకారంతో గత ఏడాదిగా ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తామని అన్నారు.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
Read Also: Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్
తమ ఆర్మీ సిబ్బంది ప్రాణాలను లెక్క చేయకుండా భయంకరమైన ఉగ్రవాదుల్ని హతమార్చాని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇతర దేశాల్లో ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందటం వల్ల ఆపరేషన్కి సమయం పడుతోందని, మన ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాజౌరీ జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఎన్కౌంటర్ 24 గంటల పాటు సాగింది. ఇందులో ఇద్దరు కెప్టెన్లతో సహా మొత్తం ఐదుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఇద్దరు కీలక ఉగ్రవాదుల్ని హతమార్చారు.
ఉగ్రవాదులు పీఓకే, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న అటవులను , పీర్ పంజాల్ కొండలను ఆసరాగా చేసుకుని భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జమ్మూలోని రాజౌరీ, పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఉగ్రవాద చర్యలు పెరిగాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణిలోని కొండలు, అడవులు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్నాయి. ఈ మార్గాల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపించాలని ప్రయత్నిస్తోంది. మన సైన్యం ఎప్పటికప్పుడు వీరిని నిర్మూలిస్తోంది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!