Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్పై సుప్రీం ఆగ్రహం..
- హర్యానాలోని 20 స్థానాల్లో రీఎలక్షన్ కోసం సుప్రీంకోర్టు పిటిషన్..
- పిటిషన్ని కొట్టివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం..
- పిటిషనర్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Elections: ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ రోజు నయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, హర్యానాలోని 20 అసెంబ్లీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్ని గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారాన్ని నిలిపేసేందుకు నిరాకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మసనం ఈ పిటిషన్ని తప్పుపట్టింది. ‘‘ఇవి ఎలాంటి పిటిషన్లు..? ఎన్నికైన ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రమాణస్వీకారం చేయకుండా ఆపాలని మీరు కోరుకుంటున్నారా..? మేము ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నాము’’అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
Read Also: Yahya Sinwar: హమాస్ చీఫ్, అక్టోబర్ 07 దాడుల మాస్టర్ మైండ్ హతం.. ఇజ్రాయిల్ హిట్ లిస్టులో తొలిపేరు…
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 90 స్థానాల్లో బీజేపీ 48 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. అక్టోబర్ 08న ఫలితాలు వెలువడిన తర్వాత, కాంగ్రెస్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపనణలు చేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాము ఈ ఫలితాలను అంగీకరించమని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
ప్రియా మిశ్రా, వికాస్ బన్సాల్ అనే ఇద్దరు పిటిషనర్ల తరుపున న్యాయవాది నరేందర్ మిశ్రా.. 20 నియోజకవర్గాల్లో ఈవీఎంలు లోపాలకు గురయ్యాయనే ఆందోళనని లేవనెత్తతూ అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని కూడా పిటిషనర్ ప్రస్తావించారు. అయితే, ఈ పిటిషన్కి తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. పిటిషనర్లు ప్రియా మిశ్రా, వికాస్ బన్సాల్ తమను తాము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై వివరణ ఇచ్చింది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!