Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్పై అన్నామలై ఆగ్రహం..
- తమిళనాడులో కొనసాగుతున్న ‘‘హిందీ భాషా’’ వివాదం..
- నటుడు విజయ్పై బీజేపీ చీఫ్ అన్నామలై ఆగ్రహం..
- విజయ్ ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’ పాటిస్తున్నాంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడులో ‘‘త్రి భాషా విధానం’’పై కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని సీఎం స్టాలిన్తో పాటు డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని బలవంతంగా ప్రయోగిస్తు్న్నారంటూ తమిళ పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా, హిందీపై నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శలు గుప్పించారు.
హిందీ భాష విషయంలో విజయ్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ అన్నామలై ఆరోపించారు. విజయ్ని ‘‘సోదరుడిగా’’ పలిచే అన్నామలై.. విజయ్ పాఠశాల ‘‘విజయ్ విద్యాశ్రమం’’లో మూడు భాషల విధానాన్ని ఎందుకు అనుసరిస్తున్నారంటూ ప్రశ్నించారు. బయట మాత్రం ఆయన విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం(టీవీకే) రెండు భాషల వ్యవస్థ కోసం మాట్లాడుతోందని, ఇది ఆయన పార్టీ ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’ అంటూ అన్నామలై మండిపడ్డారు.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
Read Also: Jharkhand: ‘‘శివరాత్రి’’ డెకరేషన్పై రాళ్ల దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..
‘‘ విజయ్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు బోధించేది, ఆచరించు బ్రో. నువ్వు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు. మీరు నడుపుతున్న విజయ్ విద్యాశ్రమ పాఠశాలలో మూడు భాషలు ఉన్నాయి. కానీ మీ పార్టీ కార్యకర్తల పిల్లలు మాత్రం రెండు భాషల్లో చదువుకోవాలా..? ’’ అంటూ కోయంబత్తూర్లో జరిగిన ఒక సభలో అన్నామలై అన్నారు.
అంతకుముందు, త్రిభాషా విధానం, హిందీపై నలుడు విజయ్ విమర్శలు గుప్పించారు. టీవీకే మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. ఈ అంశంపై విభేదిస్తున్నట్లు నటిస్తూనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రం వైఖరిని విమర్శిస్తూ, ఆయన రాజకీయ పోరాటాన్ని చిన్నపిల్లల గొడవతో పోల్చారు. బీజేపీ, డీఎంకేలు సోషల్ మీడియాలో ‘‘హ్యాష్ ట్యాగ్స్’’తో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!