నాగాలాండ్లోని మోన్ జిల్లాలో బొగ్గు గని కార్మికులను మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడిన సంగతి విధితమే. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
‘ఇది హృదయ విదారకం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిజమైన సమాధానం ఇవ్వాలి. స్వదేశంలోనే పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు అసలు హోం శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అంటూ ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెరుప్యూ రియో ఇప్పటికే అత్యున్నత స్థాయి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ 3 కోర్ సైతం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. పౌరుల ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని పేర్కొంది.
This is heart wrenching. GOI must give a real reply.
— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2021
What exactly is the home ministry doing when neither civilians nor security personnel are safe in our own land?#Nagaland pic.twitter.com/h7uS1LegzJ