PM Modi Russia Visit: మోడీ రష్యా పర్యటనపై పాశ్చాత్య దేశాల అసూయ.. క్రెమ్లిన్ కామెంట్స్..
- రేపు రష్యా పర్యటనకు ప్రధాని మోడీ..
- మోడీ పర్యటనపై వెస్ట్రన్ దేశాల అసూయ..
- ప్రధాని విజిట్ నేపథ్యంలో క్రెమ్లిన్ కీలక వ్యాఖ్యలు..
PM Modi Russia Visit:ప్రధాని నరేంద్రమోడీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మిత్రదేశం రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనను రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ పర్యటన నేపథ్యంలో రష్యా విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. జూలై 8 నుంచి 9 వరకు ప్రధాని మాస్కోలో ఉండనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీల మధ్య ఇరు దేశాలకు సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి.
Read Also: Bear Grylls: “బేర్ గ్రిల్స్” వీడియోలు రక్షించాయి.. అగ్నిపర్వతం నుంచి బయటపడిన సోదరులు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే మోడీ రష్యాలో పర్యటించడాన్ని చూసి వెస్ట్రన్ దేశాలు అసూయ పడుతున్నాయని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్తున్నారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోలో ప్రధాని మోడీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరువురు నేతలు అనధికారికంగా చర్చలు జరపొచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీజటీఆర్కే టీవీకి శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని, క్రెమ్లిన్లో ఇరువురు నేతలు విడిగా చర్చించుకోవడంతో పాటు, ప్రతినిధులతో కూడిన చర్చలు రెండూ జరుగుతాయని ఆయన అన్నారు. ఇది భారత, రష్యా సంబంధాల్లో కీలకమైన పర్యటనగా పెస్కోవ్ అభివర్ణించారు. ప్రధాని మోడీ రాకను పశ్చిమ దేశాలు నిశితంగా, అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ అన్నారు. దాదాపుగా ఐదేళ్ల క్రితం 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్లో జరిగిన ఆర్థిక సమావేశానికి ప్రధాని రష్యాకు వెళ్లారు. ఆ తర్వాత పుతిన్ చివరిసారిగా 2021లో భారత్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!