Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. భయపడేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వెళ్తోంది.. తాజాగా, నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేసింది.. తాజా పరిణామాలపై స్పందించిన రాహుల్ గాంధీ… నరేంద్ర మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు బీజేపీ అణిచివేత ఎత్తుగడల్లో భాగమని.. కానీ, బీజేపీకి తాము భయపడబోమని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు బీజేపీ బెదిరింపు వ్యూహమని అభిప్రాయపడ్డ రాహుల్.. మేం భయపడం.. ఏమి చేసినా ఓకే అన్నారు.. మన దేశాన్ని, దాని ప్రజాస్వామ్యాన్ని మరియు సోదరభావాన్ని రక్షించడానికి నేను పని చేస్తూనే ఉంటానని ప్రకటించారు.. కొంచెం ఒత్తిడి తెస్తే మౌనంగా ఉంటారని వారు అనుకుంటున్నారు.. మేం మౌనంగా ఉండబోం.. బీజేపీ చేస్తున్న దానికి వ్యతిరేకంగా నిలబడతాము, భయపడబోం అన్నారు..
Read Also: CM YS Jagan Mohan Reddy: రంగంలోకి వైఎస్ జగన్.. కుప్పం నుంచే స్టార్ట్..!
Also Read
- DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
- JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలోని యంగ్ ఇండియన్ ప్రాంగణాన్ని ఈడీ తాత్కాలికంగా సీల్ చేసిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.. అయితే, ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణాన్ని తెరవరాదని కూడా ఈడీ ఆదేశించింది. హెరాల్డ్ హౌస్ భవనంలో మిగిలిన నేషనల్ హెరాల్డ్ కార్యాలయం మాత్రం తెరిచే ఉంది.. ఇక, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించిన వారం తర్వాత నేషనల్ హెరాల్డ్-AJL-యంగ్ ఇండియన్ డీల్లోని బహదూర్షా జాఫర్ మార్గ్ కార్యాలయం మరియు 11 ఇతర ప్రదేశాల్లో ఏకకాలంలో మంగళవారం ఈడీ అధికారులు దాడులు చేశారు.. ఇప్పటికే రాహుల్ గాంధీని కూడా ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. యంగ్ ఇండియన్ ఆఫీస్ ప్రాంగణాన్ని ఈడీ తాత్కాలికంగా సీల్ చేసిన వెంటనే విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పార్టీ బెదిరిపోదని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!