CPM: మోడీ-ఆర్ఎస్ఎస్ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..
- మోడీ-ఆర్ఎస్ఎస్లను ‘‘ఫాసిస్టులు’’గా పిలువము..
- సీపీఎం నిర్ణయంపై రాజకీయ రగడ..
- బీజేపీతో రహస్య పొత్తు ఉండని కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సీపీఎం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన నోట్లో.. బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను ‘‘నయా-ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థ’’గా అభివర్ణించారు. కానీ దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన ఫాసిస్ట్ ప్రభుత్వం అని పిలవమని పేర్కొంది.
Read Also: Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
Also Read
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- My Son Is Innocent: కేతన్ హ*త్య కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు.. నేను సియాను ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
“మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియో- ఫాసిస్ట్ ప్రభుత్వం అని మేము చెప్పడం లేదు. భారత రాజ్యాన్ని మనం నియో ఫాసిస్ట్ రాజ్యంగా కూడా వర్ణించడం లేదు. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని, ఫలితంగా ‘నియో-ఫాసిస్ట్ లక్షణాలు’ మాత్రమే వ్యక్తమయ్యాయని మేము స్పష్టంగా చెబుతున్నాము.’’ అని సీపీఎం ఒక పేర్కొంది. ఏప్రిల్లో జరిగే 24వ పార్టీ కాంగ్రెస్ సమావేశానికి ముందు పార్టీ రాష్ట్ర యూనిట్లకు పంపిన రాజకీయ తీర్మానాలపై పార్టీ ముసాయిదా నోట్లో దీనిపై వివరణ ఇచ్చింది.
అయితే, సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు కుంగిపోతున్నాయి, ప్రధాని మోడీని నియంతగా ముద్ర వేయడానికి, ఫాసిస్ట్గా పిలవడానికి జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి శిక్షణ ఇచ్చాడు అంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా కాంగ్రెస్పై విరుకుపడ్డారు. మరోవైపు సీపీఎం నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. 2026లో కేరళలో సీపీఎం ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, దీనిపై రాజకీయం ప్రారంభించింది. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే కమ్యునిస్ట్ జనతా పార్టీ(సీజేపీ) బీజేపీ ఫాసిస్ట్ కాదని చెబుతోందని కేరళ కాంగ్రెస్, సీపీఎంపై ఆరోపణలు గుప్పించింది.
తాజావార్తలు
-
Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
-
Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!