CPM: మోడీ-ఆర్ఎస్ఎస్ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..
- మోడీ-ఆర్ఎస్ఎస్లను ‘‘ఫాసిస్టులు’’గా పిలువము..
- సీపీఎం నిర్ణయంపై రాజకీయ రగడ..
- బీజేపీతో రహస్య పొత్తు ఉండని కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సీపీఎం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన నోట్లో.. బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను ‘‘నయా-ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థ’’గా అభివర్ణించారు. కానీ దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన ఫాసిస్ట్ ప్రభుత్వం అని పిలవమని పేర్కొంది.
Read Also: Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
“మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియో- ఫాసిస్ట్ ప్రభుత్వం అని మేము చెప్పడం లేదు. భారత రాజ్యాన్ని మనం నియో ఫాసిస్ట్ రాజ్యంగా కూడా వర్ణించడం లేదు. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని, ఫలితంగా ‘నియో-ఫాసిస్ట్ లక్షణాలు’ మాత్రమే వ్యక్తమయ్యాయని మేము స్పష్టంగా చెబుతున్నాము.’’ అని సీపీఎం ఒక పేర్కొంది. ఏప్రిల్లో జరిగే 24వ పార్టీ కాంగ్రెస్ సమావేశానికి ముందు పార్టీ రాష్ట్ర యూనిట్లకు పంపిన రాజకీయ తీర్మానాలపై పార్టీ ముసాయిదా నోట్లో దీనిపై వివరణ ఇచ్చింది.
అయితే, సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు కుంగిపోతున్నాయి, ప్రధాని మోడీని నియంతగా ముద్ర వేయడానికి, ఫాసిస్ట్గా పిలవడానికి జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి శిక్షణ ఇచ్చాడు అంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా కాంగ్రెస్పై విరుకుపడ్డారు. మరోవైపు సీపీఎం నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. 2026లో కేరళలో సీపీఎం ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, దీనిపై రాజకీయం ప్రారంభించింది. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే కమ్యునిస్ట్ జనతా పార్టీ(సీజేపీ) బీజేపీ ఫాసిస్ట్ కాదని చెబుతోందని కేరళ కాంగ్రెస్, సీపీఎంపై ఆరోపణలు గుప్పించింది.
తాజావార్తలు
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!