CPM: మోడీ-ఆర్ఎస్ఎస్ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..
- మోడీ-ఆర్ఎస్ఎస్లను ‘‘ఫాసిస్టులు’’గా పిలువము..
- సీపీఎం నిర్ణయంపై రాజకీయ రగడ..
- బీజేపీతో రహస్య పొత్తు ఉండని కాంగ్రెస్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM: ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ని నియో-ఫాసిస్టుగా పార్టీ పరిగణించడం లేదని సీపీఎం తన రాజకీయ ముసాయిదా తీర్మానంలో పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సీపీఎం కేంద్ర నాయకత్వం విడుదల చేసిన నోట్లో.. బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను ‘‘నయా-ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థ’’గా అభివర్ణించారు. కానీ దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన ఫాసిస్ట్ ప్రభుత్వం అని పిలవమని పేర్కొంది.
Read Also: Bombay High Court: ‘‘ ఏ తల్లీ సొంత బిడ్డను కొట్టదు’’.. దాడి కేసులో మహిళకు బెయిల్..
Also Read
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
“మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ లేదా నియో- ఫాసిస్ట్ ప్రభుత్వం అని మేము చెప్పడం లేదు. భారత రాజ్యాన్ని మనం నియో ఫాసిస్ట్ రాజ్యంగా కూడా వర్ణించడం లేదు. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం అయిన బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని, ఫలితంగా ‘నియో-ఫాసిస్ట్ లక్షణాలు’ మాత్రమే వ్యక్తమయ్యాయని మేము స్పష్టంగా చెబుతున్నాము.’’ అని సీపీఎం ఒక పేర్కొంది. ఏప్రిల్లో జరిగే 24వ పార్టీ కాంగ్రెస్ సమావేశానికి ముందు పార్టీ రాష్ట్ర యూనిట్లకు పంపిన రాజకీయ తీర్మానాలపై పార్టీ ముసాయిదా నోట్లో దీనిపై వివరణ ఇచ్చింది.
అయితే, సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. కాంగ్రెస్ కుట్రలు ఇప్పుడు కుంగిపోతున్నాయి, ప్రధాని మోడీని నియంతగా ముద్ర వేయడానికి, ఫాసిస్ట్గా పిలవడానికి జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీకి శిక్షణ ఇచ్చాడు అంటూ బీజేపీ నేత అమిత్ మాల్వియా కాంగ్రెస్పై విరుకుపడ్డారు. మరోవైపు సీపీఎం నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. 2026లో కేరళలో సీపీఎం ఓడించడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, దీనిపై రాజకీయం ప్రారంభించింది. బీజేపీతో రహస్య ఒప్పందం కారణంగానే కమ్యునిస్ట్ జనతా పార్టీ(సీజేపీ) బీజేపీ ఫాసిస్ట్ కాదని చెబుతోందని కేరళ కాంగ్రెస్, సీపీఎంపై ఆరోపణలు గుప్పించింది.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!