India Pakistan: ‘‘ మా నీరు ఆపితే, మీ గొంతు కోసి చంపేస్తాం’’.. ఉగ్రవాదిలా పాక్ ఆర్మీ అధికారి బెదిరింపులు..
- ‘‘ మా నీరు ఆపితే, మీ గొంతు కోస్తాం’’..
- ఉగ్రవాది హఫీస్ సయీద్ లాగే పాక్ ఆర్మీ అధికారి బెదిరింపు..
- సింధు జలాల నిలిపివేతపై భారత్ని బెదిరించే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద భాష మారడం లేదు. భారత్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నా, పాక్ ఎయిర్ ఫోర్స్ ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయినా ఆ దేశానికి బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదులు మాట్లాడే భాషలోనే అక్కడి ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు. గతంలో, సింధు జలాల నిలిపివేతపై లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీస్ సయీద్ మాట్లాడుతూ.. ‘‘మీ గొంతులు కోస్తాం’’ అని భారత్ని బెదిరించే ప్రయత్నం చేశాడు.
Read Also: West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
అయితే, ఇప్పుడు ఆ దేశానికి చెందిన సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ కూడా ఉగ్రవాద భాష మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘మీరు మా నీటిని అడ్డుకుంటే, మేము మిమ్మల్ని గొంతు కోసి చంపేస్తాము’’ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తేనే ఒప్పందాన్ని మళ్లి పునరుద్ధరిస్తామని భారత్ స్పష్టం చేసింది.
గతంలో లష్కరే తోయిబా చీఫ్, ప్రమాదకర ఉగ్రవాది హఫీస్ సయీద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘మీరు నీటిని ఆపివేస్తే, దేవుడు కోరుకుంటే, మేము మీ శ్వాసను ఆపివేస్తాము, ఆపై ఈ నదులలో రక్తం ప్రవహిస్తుంది’’ అని ఓ బహిరంగ సభలో అన్నాడు. అఫ్ఘన్ రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియం సోలైమాంఖిల్ షరీఫ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘‘అతను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ చెప్పిన “భారతదేశం నీటిని ఆపివేస్తే మేము వారి శ్వాసను ఆపివేస్తాము” అనే మాటలను కాపీ చేసినట్లు అనిపిస్తుంది, పాకిస్తాన్ సైనిక వ్యవస్థ గుర్తింపు పొందిన ఉగ్రవాదులతో ఒక స్క్రిప్ట్ను పంచుకుంటుందని నేను అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
A spokesperson for the Pakistani military issued a warning to India regarding the suspension of the Indus Water Treaty,
quoting terrorist Hafiz Saeed with the statement: ‘If you cut off our water, we will cut off your breath.’
pic.twitter.com/hl45IPfLVM— Harsh Patel (@Harshpatel1408) May 23, 2025
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!