West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..
- ‘‘అమ్మా.. నేను దొంగను కాదు, చిప్స్ దొంగిలించలేదు’’..
- పబ్లిక్గా అవమానించడంతో 12 బాలుడి ఆత్మహత్య..
- అందరితో కంటతడి పెట్టిస్తున్న ఘటన..
- ఆత్మహత్యకు కారణమైన దుకాణం యజమాని పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ మేదినీపూర్లో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య అందరితో కన్నీరు పెట్టిస్తోంది. చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలపై బహిరంగంగా అవమానించబడటంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మరణించడానికి ముందు, తన ఇంట్లో తన తల్లికి ఒక సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నేను చిప్స్ దొంగిలించలేదు’’ అని అందులో పేర్కొన్నాడు. ఇది చూస్తే, ఎంతలా ఆ పసి హృదయం బాధించబడిందో అర్థమవుతోంది. ఈ సంఘటన గురువారం సాయంత్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో జరిగిందని పోలీసులు తెలిపారు.
7వ తరగతి చదువుతున్న కృష్ణేందు దాస్ అనే 12 ఏళ్ల బాలుడు చిప్స్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్లాడు. అయితే, దుకాణం యజమాని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తిని పదే పదే పిలిచినప్పటికీ స్పందించలేదు. పిల్లవాడు ‘‘అంకుల్ నేను చిప్స్ కొంటాను’’ అని పదే పదే చెప్పినా లోపల ఉన్న యజమాని నుంచి స్పందన రాలేదు. ఎవరూ లేరని, తర్వాత డబ్బులు ఇద్దామనే ఉద్దేశ్యంతో బాలుడు షాప్ ఎంట్రీ వద్ద ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాడని కుటుంబీకులు చెప్పారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also: IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
అయితే, కొద్ది క్షణాల తర్వాత దుకాణం యజమాని కృష్ణేందును వెంబడించి, చెంపదెబ్బ కొట్టి, బహిరంగంగా గుంజీలు తీయమని బలవంతం చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిని సంఘటనా స్థలానికి పిలిపించి, తిట్టారు. పిల్లవాడు చిప్స్ ప్యాకెట్కి డబ్బులు చెల్లించడానికి ప్రయత్నించానని చెప్పినప్పటికీ, అతను అబద్ధం చెప్పాడని ఆరోపించాడు.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, బాలుడు గదిలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. చివరకు అతడిని అపస్మారక స్థితిలో తల్లి, ఇరుగుపొరుగు వారు గుర్తించారు.రూమ్లో పరుగుల మందు సీసా ఉండటం, బాలుడి నోటి నుంచి నురగ కారుతుండటంతో, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తించారు. కృష్ణేందును వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసియులో చేర్చారు, కానీ కొద్దిసేపటికే అతను మరణించాడు. బాలుడి మరణం తర్వాత దుకాణం యజమాని పారపోయాడు.
ఆత్మహత్యకు ముందు బాలుడు సూసైడ్ నోట్ రాశాడు. అందులో..‘‘అమ్మా, నేను దొంగను కాదు. నేను దొంగతనం చేయలేదు. నేను వేచి ఉండగా మామయ్య (దుకాణదారుడు) నా దగ్గర లేడు. తిరిగి వస్తుండగా, రోడ్డు మీద పడి ఉన్న కుర్కురే ప్యాకెట్ ను చూసి దాన్ని తీసుకున్నాను. నాకు కుర్కురే అంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు ఇవే నా చివరి మాటలు, దయచేసి నన్ను క్షమించండి’’ అంటూ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!