Nitin Gadkari: ప్రతిపక్షాలను ఏకం చేసింది మేమే
Nitin Gadkari: దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసిన ఘనత తమదేనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్తోపాటు 26 ప్రతి పక్ష పార్టీలు ఇండియా(I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే వంటి 26 పార్టీలు ఇండియా (I.N.D.I.A) కూటమిగా ఏర్పడ్డాయని, ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా చేసిన ఘనత తమదేనని కేంద్ర మంత్రి చెప్పారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన ‘ఆజ్ తక్ జీ20 సదస్సు’లో శనివారం ఆయన మాట్లాడారు.
Read also: Nidhi Agarwal : ప్రభాస్ సరసన నటించబోతున్న హాట్ బ్యూటీ..?
Also Read
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం చెబుతూ.. ప్రతిపక్షాల ఐక్యతకు రూపశిల్పి బీజేపీయేనని చెప్పారు. సిద్ధాంతాలు కలవనివారు.. ఒకరి ముఖం మరొకరు చూసుకోనివారు.. కలిసి కూర్చుని కనీసం టీ తాగని వారు ఇప్పుడు బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కొత్త ప్రాజెక్టుల గురించి చెబుతూ.. కశ్మీరును కన్యా కుమారితో అనుసంధానం చేయడం కోసం ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తామని తెలిపారు. యాక్సెస్ కంట్రోల్ రోడ్ ద్వారా ఈ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ద్వారక ఎక్స్ప్రెస్వేను నిర్మించడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో .. దానిపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. కాగ్ నివేదికలో చెప్పినట్లుగా ఈ మార్గం పొడవు 29 కిలోమీటర్లు కాదని.. అది 230 కిలోమీటర్ల పొడవైన మార్గమని తెలిపారు. దానిలో సొరంగాలు కూడా ఉన్నాయని, ఒక్కొక్క కిలోమీటరుకు రూ.9.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ విషయాన్ని తాను కాగ్ అధికారులకు వివరించానని చెప్పారు. కాగ్ నివేదిక ప్రకారం, ద్వారక ఎక్స్ప్రెస్వే పొడవు 29.06 కిలోమీటర్లు. ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.250.77 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ ఒక్కొక్క కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.18.2 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. అత్యధిక ఖర్చుతో రోడ్డును నిర్మిస్తున్నారని ఈ నివేదికలో పేర్కొనగా.. ఈ ఆరోపణలను నితిన్ గడ్కరీ ఖండించారు. నివేదికలో అన్ని విషయాలు కరెక్ట్ కాదన్నారు.
తాజావార్తలు
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో