Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News We Attacked The Area Of Pakistan Army Chief Asim Munir And Pm Shehbaz Sharif

Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీఎం షెహబాజ్ షరీఫ్ అడ్డానే కొట్టి వచ్చాం..

Published Date :May 7, 2025 , 7:02 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్ పంజాబ్‌పై దాడి..
  • ఆర్మీకి, ప్రధాని షరీఫ్‌‌కి నేరుగా వార్నింగ్..
Operation Sindoor: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పీఎం షెహబాజ్ షరీఫ్ అడ్డానే కొట్టి వచ్చాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇచ్చింది. గత నెలలో పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మతం ఆధారంగా హిందువులను టార్గెట్ చేస్తూ కాల్చి చంపారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు.

ప్రజల మనోభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల్ని వణికించింది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకే‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేసింది. హామర్, స్కాల్ప్ మిసైళ్లతో విరుచుకుడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి శిక్షణ శిబిరాలను నాశనం చేసింది.

Also Read

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

ఈ దాడి ఎంతో ప్రత్యేకం:

అయితే, గతంతో పోలిస్తే ఈసారి పాకిస్తాన్‌లో దూరి మరీ భారత్ లక్ష్యాలను కొట్టి వచ్చింది. గతంలో పీఓకేలో ఉగ్రవాదుల్ని అణిచివేసిన భారత్, ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుల్లోని సియాల్‌కోట్, మురిడ్కేలతో పాటు సరిహద్దులకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ వంటి ప్రాంతాలను టార్గెట్ చేసింది. బహవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్, దీని చీఫ్ మసూద్ అజార్ కూడా ఇక్కడే ఉంటాడు. ఈ ఉగ్రవాదిని టార్గెట్ చేస్తూ భారత్ తీవ్ర దాడులు జరిపింది. మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది ఈ దాడుల్లో హతమయ్యారు.

పాక్ ఆర్మీ చీఫ్, పీఎం షహబాజ్ షరీఫ్‌లకు వార్నింగ్..

ఈ దాడుల ద్వారా భారత్ పాకిస్తాన్‌కి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. మీరు ఉగ్రవాదానికి పాల్పడితే పాకిస్తాన్‌లోకి దూరి మరీ విధ్వంసం సృష్టిస్తామని చెప్పింది. గతంలో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బాలాకోట్ ఉగ్ర శిబిరంపై దాడి చేయడం, ఇప్పుడు పంజాబ్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లో దాడి చేయడానికి చాలా తేడా ఉంది.

నిజానికి పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులు ఉన్నప్పటికీ పాక్ పరిపాలన, సైన్యం అంతా పంజాబ్‌కి చెందిన వారే ఉంటారు. రాజకీయ నాయకత్వం, సైన్యాధికారులు పంజాబీలే. ఇప్పుడు భారత్ పంజాబ్‌పై దాడి చేయడం చూస్తే, నేరుగా వీరినే ఛాలెంజ్ చేసినట్లు అవుతుంది. పాకిస్తాన్ మొత్తం పంజాబ్ అస్థి్త్వంపైనే ఆధారపడి ఉంది. ఆ దేశంలో ఒక్క పంజాబ్ ప్రజలు మాత్రమే పాకిస్తాన్ గురించి ఆలోచిస్తుంటారు. మిగతా మూడు ప్రావిన్సులు వారిలో పాకిస్తాన్ దేశం అనే భావన ఉండదు. పంజాబీల విపరీతమైన డామినేషన్ కూడా ఇందుకు ఓ కారణం. ఇప్పుడు భారత్ తన సరిహద్దు నుంచి పాక్ పంజాబ్ లోని 100 కి.మీ దూరంలోని బహవల్పూర్‌లో దాడి చేయడం పాక్ పాలనలకు గట్టి హెచ్చరిక అని చెప్పవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Pakistan
  • Operation Sindoor
  • Pahalgam terror attack
  • pakistan army chief asim Munir
  • PM Shehbaz Sharif

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions