Pakistan: రావి నది ప్రవాహాన్ని నిలిపేసిన భారత్.. ఇది “వాటర్ టెర్రరిజం” అంటూ పాక్ గగ్గోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, మనకు హక్కుగా ఉన్న నీటిని ఉపయోగించుకోనున్నాం.
అయితే, ఇన్నాళ్లు అప్పనంగా రావీ నదీ జలాలను అనుభవించిన పాకిస్తాన్ ఈ విషయంపై తన అక్కసు వెళ్లగక్కుతోంది. అక్కడి మీడియా భారత్ ‘వాటర్ టెర్రరిజం’కి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. రావి నదీ జలాలను పరిరక్షించాలని, సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ లాహోర్లో ప్రజలు భారీ ర్యాలీ చేశారు. నిజానికి రావి నది నీటిపై భారత్కి ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ.. పాక్ మీడియా మాత్రం భారత్ని బద్నాం చేసే విధంగా వార్తల్ని ప్రచురిస్తోంది. లాహోర్లో ప్రజలు భారత్-పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
Read Also: Abu Dhabi: మోడీ ప్రారంభించిన దేవాలయంపై అప్డేట్ ఇదే!
రావి నదిపై ఉన్న షాపూర్కండి ప్రాజెక్ట్ భారతదేశానికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది, జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్లోని 37,000 హెక్టార్ల భూమిలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది మరియు 206 మెగావాట్ల శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు రావి నదికి ఉపనది అయిన ఉజ్ నదిపై జమ్మూ కాశ్మీర్లోని కథువా ప్రాంతంలో ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ నిర్మిస్తోంది. దీని ద్వారా 781 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇటీవల సింధు నది మరో ఉపనది అయిన ‘చీనాబ్’ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూకాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్లు, పాకిస్తాన్కి పశ్చిమ నదులు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!