Radhika Khera: రాహుల్ గాంధీ యాత్రలో నాకు మద్యం ఆఫర్ చేశారు.. కాంగ్రెస్పై రాధికా ఖేరా సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Khera: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న రాధికా ఖేరా ఆ పార్టీకి నిన్న రాజీనామా చేశారు. తాను అయోధ్యలో రాముడిని దర్శించుకున్నందుకు పార్టీలో చాలా మంది నాయకులు తనను వేధించారని ఆమె నిన్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అగ్రనాయకత్వానికి చెప్పినా కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె సోమవారం మరోసారి కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ అగౌరవంగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సచిన్ పైలట్, జైరాం రమేష్, భూపేష్ బాఘేల్, పవన్ ఖేరాలకు సమాచారం ఇచ్చారని పార్టీలో మగ దురహంకార మనస్తత్వాన్ని బయటపెడతానని ఖేరా అన్నారు.
తాను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసేందుకు మూడేళ్లుగా వారి టైం కోరుతున్నానని, కానీ వారెవరు నన్ను కలిసేందుకు ఒప్పుకోలేదని ఆమె అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్రలో ఎవరినీ కలవలేదని, ప్రజల వద్ద కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉండి, తర్వాత అతని వాహనంలోకి వెళ్లారని అన్నారు. అతను కేవల ట్రావెల్ వ్లాగర్ కావాలనుకున్నాడని ఎద్దేవా చేసింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Bomb threats: అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
ఈ విషయంపై తాను ఏ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడినా, తనను మైనంగా ఉండమనే వారని, సుశీల్ ఆనంద్ అగౌరవంగా మాట్లాడిన విషయాన్ని మాజీ సీఎం భూపేష్ బఘేల్కి చెబితే తను ఛత్తీస్గఢ్ విడిచిపెట్టాలని కోరారని ఆమె ఆరోపించారు. సుశీల్ ఆనంద్ తనను అసభ్యకరమైన పదజాలంతో దూషిచారని, తన అనుచరులతో ఒక నిమిషం పాటు గదిలో బంధించినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంపై బఘేల్, పవన్ ఖేరా, సచిన్ పైలట్లకు సమాచారం అందించిన వారు తనకు సాయం చేయలేదని చెప్పారు.
జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎవరు తనకు సాయం చేయడానికి ముందుకు రాలేదని కన్నీరు పెట్టుకుంటూ రాధికా ఖేరా ఆరోపించారు. అయోధ్ సందర్శన తర్వాత పార్టీ తనను అవమానించిందని, భారత్ జోడో యాత్ర ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించిన తర్వాత సుశీల్ ఆనంద్ పదేపదే నాకు మద్యం ఆఫర్ చేశాడని ఖేరా ఆరోపించారు. సుశీల్ ఆనంద్తో పాటు 5-6 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మత్తులో తన గదిని కొట్టేవారని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినా పంచ కాంగ్రెస్ హిందూ, రాముడు వ్యతిరేక ఆలోచన ఉన్న పార్టీ అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!