Bomb threats: అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి. లోక్సభ మూడోదశ ఎన్నికల్లో రేపు గుజరాత్ లోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. నగరంలోని మొత్తం 7 పాఠశాలకు రష్యన్ IP అడ్రస్తో కూడిన సర్వర్ల నుండి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో సహా పోలీసు అధికారుల బృందాలు పాఠశాలల్లో సోదాలు నిర్వహించాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
Read Also: Vijayendra Prasad: రాజమౌళి తండ్రి ఎన్నికల ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
బెదిరింపు ఇమెయిల్లు వచ్చిన పాఠశాలల్లో అమృత విద్యాలయం, కేంద్రీయ విద్యాలయ ONGC (చంద్ఖేడా), ఆర్మీ స్కూల్ (షాహిబాగ్), ఆనంద్ నికేతన్ మరియు DPS (బోపాల్) ఉన్నాయి. ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోని 28 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి.
గత వారం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని 151 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో విద్యార్థుల్ని వెంటనే స్కూళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. పోలీసులు ఇతర అధికారులు పాఠశాలల్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బూటకపు బాంబు బెదిరింపులుగా తేల్చారు. ఈ ఈమెయిళ్లు కూడా రష్యన్ డొమైన్ నుంచే వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ఐపీ అడ్రస్ను మాస్క్ చేసి ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రగా అధికారలు అనుమానిస్తున్నారు. తరుచుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉపయోగించే అరబిక్ పదం ‘సవారిమ్’తో ఈ ఈమెయిళ్లు ముడిపడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!