Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’.. మహిళా ఎంపీలతో ఉన్న ఫొటో పోస్ట్
- లోక్సభ మొదటి రోజు సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
- 2019.. 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఫొటో పోస్ట్
- 'యోధులు తిరిగి వచ్చారు' అని క్యాప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక ‘x’లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ‘యోధులు తిరిగి వచ్చారు’ అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్లు లోక్సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.
Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోడీ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
మహువా మొయిత్రా.. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతి స్థానం నుండి సుప్రియా సూలే, తమిళనాడులోని చెన్నై సౌత్ వెస్ట్ కరూర్ నుండి తమిజాచి తంగపాండియన్, ఉత్తరప్రదేశ్లోని మైన్పురి లోక్సభ స్థానం నుండి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ మహిళా ఎంపీలందరూ 18వ లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.
Read Also: Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
18వ లోక్సభలో మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఉంటే.. ఇప్పుడు మరో 4 తగ్గారు. మహిళా ఎంపీల పరంగా పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. ఇక్కడ నుండి 11 మంది మహిళా ఎంపీలు విజయం సాధించారు. మరోవైపు.. 18వ లోక్సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియామకం, పార్లమెంట్ కాంప్లెక్స్లో విగ్రహాల స్థానభ్రంశం, నీట్ పేపర్ లీక్పై విపక్షాలు రచ్చను సృష్టిస్తూనే ఉన్నాయి.
The warriors are back ! 2024 vs 2019@KanimozhiDMK @dimpleyadav @supriya_sule @jothims @ThamizhachiTh pic.twitter.com/D1lJGHFFhb
— Mahua Moitra (@MahuaMoitra) June 24, 2024
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!