Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’.. మహిళా ఎంపీలతో ఉన్న ఫొటో పోస్ట్
- లోక్సభ మొదటి రోజు సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
- 2019.. 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఫొటో పోస్ట్
- 'యోధులు తిరిగి వచ్చారు' అని క్యాప్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక ‘x’లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ‘యోధులు తిరిగి వచ్చారు’ అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్లు లోక్సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.
Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోడీ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
మహువా మొయిత్రా.. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతి స్థానం నుండి సుప్రియా సూలే, తమిళనాడులోని చెన్నై సౌత్ వెస్ట్ కరూర్ నుండి తమిజాచి తంగపాండియన్, ఉత్తరప్రదేశ్లోని మైన్పురి లోక్సభ స్థానం నుండి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ మహిళా ఎంపీలందరూ 18వ లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు.
Read Also: Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం
18వ లోక్సభలో మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఉంటే.. ఇప్పుడు మరో 4 తగ్గారు. మహిళా ఎంపీల పరంగా పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. ఇక్కడ నుండి 11 మంది మహిళా ఎంపీలు విజయం సాధించారు. మరోవైపు.. 18వ లోక్సభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ నియామకం, పార్లమెంట్ కాంప్లెక్స్లో విగ్రహాల స్థానభ్రంశం, నీట్ పేపర్ లీక్పై విపక్షాలు రచ్చను సృష్టిస్తూనే ఉన్నాయి.
The warriors are back ! 2024 vs 2019@KanimozhiDMK @dimpleyadav @supriya_sule @jothims @ThamizhachiTh pic.twitter.com/D1lJGHFFhb
— Mahua Moitra (@MahuaMoitra) June 24, 2024
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..