Sikkim Landslides: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఆరుగురు మృతి… ప్రమాదంలో 1500 మంది
- సిక్కిం రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు
- కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి
- మంగన్కు ద్జోంగ్ చుంగ్తాంగ్లతో తెగిపోయిన సంబంధాలు
- ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కకున్న 1500మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikkim Landslides: ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించారు. ఇది కాకుండా 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ మేరకు అధికారులు గురువారం సమాచారం అందించారు. సంగ్కలాంగ్లో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందని, దీని కారణంగా మంగన్కు ద్జోంగ్, చుంగ్తాంగ్లతో సంబంధాలు తెగిపోయాయని వారు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయని, అనేక ఇళ్లు నీటమునిగి దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయని తెలిపారు.
Read Also:Joe Biden: జో బైడెన్కి ఏమైంది, జీ-7 కోసం వెళ్లి వింత ప్రవర్తన.. వీడియో వైరల్..
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ఇతర ప్రాంతాలతో సంబంధాలు కట్
గురుడోంగ్మార్ సరస్సు, యుంథాంగ్ వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మంగన్ జిల్లాలోని జోంగు, చుంగ్తాంగ్, లాచెన్, లాచుంగ్ వంటి పట్టణాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మంగన్ జిల్లా మేజిస్ట్రేట్ హేమ్ కుమార్ ఛెత్రీ మాట్లాడుతూ, గీతాంగ్, నాంపతంగ్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. నిర్వాసితుల కోసం సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఛెత్రి తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో బ్రింగ్బాంగ్ పోలీసు పోస్ట్ను సమీపంలోని ప్రదేశానికి మార్చారు. సంకలన్ వద్ద వంతెన పునాది దెబ్బతింది. నిరంతర వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ఉత్తర సిక్కింలో మొబైల్ నెట్వర్క్ ప్రభావితమైందని అధికారులు తెలిపారు. మంగన్కు రేషన్తో కూడిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాన్ని పంపాలని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది. మంగ్శిలా డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
Read Also:Ashada Bonalu: భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
సిక్కిం ముఖ్యమంత్రి ప్రకటన
బిజెపి నాయకుడు పెమా ఖండూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అరుణాచల్ ప్రదేశ్కు వచ్చిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉత్తర జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తమాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పునరావాస సహాయాన్ని అందించడానికి, తాత్కాలిక నివాసాలకు ఏర్పాట్లు చేయడానికి, ప్రాథమిక అవసరాలను తీర్చడానికి పని జరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండచరియల కారణంగా నష్టపోయిన.. నిరాశ్రయులైన వారందరికీ అండగా నిలుస్తుంది. త్వరలో సిక్కింకు తిరిగి వెళ్లి రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తుంది.
తాజావార్తలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!