Vodafone Idea AGR dues : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట..
- వోడాఫోన్ ఐడియాకు ఊరట
- AGR బాకీలపై మారటోరియం
- వడ్డీ భారం తగ్గింపు
- టెలికాం పోటీకి బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea AGR dues : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియాను గట్టెక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్, కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ. 87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బాకీల విషయంలో ఊరట ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కంపెనీ తన బాకీలను చెల్లించే విషయంలో ఐదేళ్ల పాటు మారటోరియం విధిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అంటే, ఈ భారీ మొత్తాన్ని వోడాఫోన్ ఐడియా తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను ఫ్రీజ్ చేయడమే కాకుండా, వీటి చెల్లింపు గడువును 2031-32 ఆర్థిక సంవత్సరం నుండి 2040-41 వరకు, అంటే పదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి తక్షణమే నగదు లభ్యత పెరగడంతో పాటు, నెట్వర్క్ విస్తరణ , 5G సేవలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Konaseema District: ఏపీలో శివలింగం ధ్వంసం కేసులో సంచలన విషయాలు.. నిందితుడు ఎవరంటే..?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ టెలికాం రంగం కేవలం రెండు ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లకుండా ఉండాలంటే, మూడో ప్రధాన సంస్థగా వోడాఫోన్ ఐడియా మనుగడ సాగించడం అత్యవసరం. ఒకవేళ ఈ కంపెనీ దివాలా తీస్తే, అందులో దాదాపు 49 శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, సుమారు 20 కోట్ల మంది వినియోగదారులు ఇబ్బందులు పడతారని కేంద్రం భావించింది. అందుకే, ఈ ఐదేళ్ల మారటోరియం కాలంలో పెండింగ్ బాకీలపై ఎటువంటి అదనపు వడ్డీని కూడా వసూలు చేయకూడదని నిర్ణయించడం విశేషం.
దీనివల్ల కంపెనీకి సుమారు రూ. 18,000 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని టెలికాం శాఖ మరోసారి క్షుణ్ణంగా ఆడిట్ చేసి సమీక్షిస్తుందని, తుది లెక్కలు కమిటీ నివేదిక ఆధారంగా ఖరారు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ భారీ ప్యాకేజీ వోడాఫోన్ ఐడియాకు ఊపిరి పోయడమే కాకుండా, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని నిలబెట్టడానికి దోహదపడనుంది.
Hyundai Creta Sales 2025: ఈ ఏడాది అమ్మకాల్లో హ్యుందాయ్ క్రేటా సంచలనం.. గంటకు 23 కార్లు విక్రయం..!
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!