Babita Phogat: కాంగ్రెస్ సీనియర్ నేతపై బబిత ఫైర్.. కుటుంబంలో గొడవలు సృష్టించారని ఆగ్రహం
- హర్యానా కాంగ్రెస్ సీనియర్ నేతపై బబిత ఫైర్
- వినేష్ కుటుంబంలో గొడవలు సృష్టించారని బంధువు ఆగ్రహం
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్పై నిప్పుల చెరిగారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: 10 రోజుల తర్వాత నివాసానికి సీఎం.. ప్రతీ రోజూ క్షేత్రస్థాయి పర్యటన
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హుడా పన్నిన పన్నాగంలో కుటుంబంలో చీలిక వచ్చిందని బబిత ఆరోపించారు. కాంగ్రెస్ విధానమే విభజన విధానం అని దుమ్మెత్తిపోశారు. రాజకీయ లబ్ధి కోసమే వినేష్ ఫోగట్ కుటుంబంలో కాంగ్రెస్ చీలిక తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విభజించి పాలించడమే కాంగ్రెస్ అజెండా అని.. కుటుంబాలను విచ్ఛిన్నంగా చేయడమే లక్ష్యంగా హస్తం పార్టీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. వినేష్.. తన పెద్దనాన్న మహవీర్ ఫోగట్ సలహాను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మహవీర్.. వినేష్ గురువు.. ఆయనే సరైన మార్గదర్శకత్వంలో మార్గం చూపిస్తారని హితవు పలికారు. 2028లో వినేష్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకునే సత్తా ఉందన్నారు. రాజకీయాలను వదిలి రెజ్లింగ్పై దృష్టి పెట్టాలని వినేష్కు బబిత సూచించారు.
ఇది కూడా చదవండి: Heart Diseases: గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాలేంటి..? ఏ విధంగా గుండెపై ప్రభావం చూపిస్తాయి.?
వినేష్ ఫోగట్ సెప్టెంబర్ 6న కాంగ్రెస్లో చేరారు. కొద్ది సేపటికే జులానా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. 2019లో బీజేపీలో చేరిన బబితకు మాత్రం ఈ ఎన్నికల్లో కమలం పార్టీ సీటు కేటాయించలేదు. అయినా బాధలేదని ఆమె చెప్పుకొచ్చారు. బీజేపీకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ ఇప్పటి వరకు రెండు జాబితాలను వెల్లడించింది. మొత్తం 88 స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో