ఇక 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిపోయింది.. దీంతో, క్రమంగా అన్ని ఏజ్ గ్రూపులకు వ్యాక్సిన్ వేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే కాగా.. త్వరలోనే 15 ఏళ్ల లోపు వారికి కూడా టీకాలు వేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇవాళ వ్యాక్సినేషన్పై మాట్లాడిన జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా… త్వరలోనే 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయనున్నట్టు వెల్లడించారు.. ఎందుకంటే 15 – 18 ఏజ్ గ్రూప్కు మార్చి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని.. ఆ తర్వాత 15 ఏళ్లకు లోపు వారికి టీకాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని.. త్వరలోనే విధివిధానాలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానున్నట్టు వెల్లడించారు.
Read Also: విద్యా విధానంపై తెలంగాణలో కొత్త చట్టం..!
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
దేశవ్యాప్తంగా 15-18 సంవత్సరాల వయస్సు గలవారు 7.4 కోట్ల మంది వరకు ఉండా.. అందులో ఇప్పటివరకు 3.45 కోట్ల మందికి పైగా కోవాక్సిన్ మొదటి డోస్ పొందారని, వారి రెండవ డోస్ 28 రోజుల్లో ఇవ్వబడుతుందని.. ఇక, 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది వరకు ఉంటారని తెలిపారు అరోరా.. మరోవైపు ఈరోజు వ్యాక్సినేషన్ నివేదికల ప్రకారం.. గత 24 గంటల్లో 39 లక్షలకు పైగా డోస్లు అందించబడ్డాయి, దీనితో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 157.2 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించబడింది, మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఇవ్వగా.. ఫ్రంట్లైన్ కార్మికుల టీకా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమైంది.. టీకా తదుపరి దశ గత ఏడాది మార్చి 1న 60 ఏళ్లు పైబడిన వారికి మరియు 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రారంభించబడింది.. దేశం ఏప్రిల్ 1, 2021 నుండి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ను ఇవ్వడం మొదలుపెట్టగా.. మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడానికి అనుమతించబడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!