India At UN: పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి.. పాక్పై ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: దాయాది పాకిస్తాన్ ప్రధాని అన్వరుల్ కాకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్పై ఆరోపణలు చేశారు. మరోసారి పాకిస్తాన్ యూఎన్ లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి ప్రతిగా భారత్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాలని, ఉగ్రవాదాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
భారత్ కి వ్యతిరేఖంగా నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారాలను పాకిస్తాన్ అలవాటుగా చేస్తోందని యూఎన్ లో భారత సెక్రటరీ పటేల్ గెహ్లాట్ విమర్శించారు. అంతర్జాతీయ దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్ ఇలా చేస్తుందని భారత్ ఘాటుగా విమర్శించింది. పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘననుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తుందని చెప్పింది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Mynampally: మల్కాజ్గిరి టికెట్ నాకొద్దు.. పార్టీకే రాజీనామా చేస్తున్న.. మైనం పల్లి లేఖ
భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు పూర్తిగా భారత అంతర్గత విషయమని, మా అంతర్గత వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్ కు ఎలాంటి అధికారం లేదని చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఉగ్రవాద మౌళిక సదుపాయాలను మూసేయాలని, పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని భారత్ చెప్పింది.
2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హితభోద చేసింది. మానవ హక్కుల విషయంలో ఇతర దేశాల వైపు వేలెత్తి చూపడానికి ముందు పాకిస్తాన్ తన సొంత ఇంటిని చూసుకోవాలని, 2023లో పాక్ ఫైసలాబాద్ జిల్లాలో జరన్ వాలాలో మైనారిటీ క్రైస్తవుల దాడిని భారత్ ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!