Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uttar Pradesh Police Releases Sonam Statement

Sonam: యూపీ పోలీసులతో సోనమ్ ఏం చెప్పిందంటే..!

Published Date :June 10, 2025 , 7:50 am
By Suresh Maddala
  • సోనమ్‌ స్టేట్‌మెంట్‌ను బయటపెట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు
  • సోనమ్ కట్టుకథ అల్లుతున్నట్లుగా తేల్చిన పోలీసులు
Sonam: యూపీ పోలీసులతో సోనమ్ ఏం చెప్పిందంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు. తనకు మత్తుమందు ఇచ్చి లోయలోంచి పైకి తీసుకొచ్చారని.. అనంతరం ఘాజీపూర్‌లో విడిచిపెట్టినట్లుగా ఆమె చెప్పినట్లుగా యూపీ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ యష్ మీడియాతో పేర్కొన్నారు. సోనమ్ బాధితురాలిగా చెప్పుకుందని.. పోలీసులు తన దగ్గరకు వస్తారనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి: YS Jagan: కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా..? ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ సీఎం..!

సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను ఘాజీపూర్-వారణాసి రోడ్డులోని ధాబాలో ఉన్నట్లుగా సోనమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబం వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులను సంప్రదించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ధాబాకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..

ఇక సోనమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా.. ఆమె చెప్పిందంతా కట్టుకథగా తేలింది. సీసీ కెమెరాల్లో ఆమె ఒక్కతే వస్తున్నట్లుగా కనిపించింది. కిడ్నాపర్లు విడిచిపెట్టిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో సోనమ్ కట్టుకథ అల్లిందని యూపీ పోలీసులు తేల్చారు. ఆమెకు పోలీసుల విధానాల గురించి సరైన అవగాహన లేదని.. బాధితురాలిగా నటిస్తూ తప్పించుకోవచ్చని భావించిందని.. కానీ అది విఫలమైందని అమితాబ్ యష్ తేల్చారు. ప్రస్తుతం ఈ కేసును మేఘాలయ పోలీసలు విచారిస్తున్నారని.. ఏదైనా సాయం కావాలంటే సహకరిస్తామని యూపీ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రాజా రఘువంశీని చంపి.. అనంతరం ఎవరు వెళ్లలేని ప్రదేశంలో మృతదేహాన్ని పడేయాలని ఒక పక్కా ప్రణాళికతో కుట్ర పన్నారని.. కానీ ఆ ప్లాన్ అంతా అట్టర్ ప్లాప్ అయిందని అమితాబ్ యష్ చెప్పుకొచ్చారు.

అయితే సోనమ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మేఘాలయ పోలీసులు కూడా తోసిపుచ్చారు. కట్టుకథ అల్లుతున్నట్లుగా పేర్కొన్నారు. రాజ్ కుష్వాహా‌తో సోనమ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తేల్చారు. ఒత్తిడికి లోనై జూన్ 9న పోలీసుల ఎదుట లొంగిపోయిందని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. మృతదేహాన్ని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. జూన్ 9న యూపీలో సోనమ్ ప్రత్యక్షం కావడంతో మర్డర్ మిస్టరీ వీడింది. ప్రస్తుతం సోనమ్ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhaba Owner Indore man murder
  • Meghalaya
  • Meghalaya murder twist
  • Raja murder Case
  • Raja raghuwanshi

తాజావార్తలు

  • Virosh: ఏందయ్యా మాకీ గోల?

  • Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’ రికార్డులు బ్రేక్

  • Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?

  • Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా

  • PSL 2026: వార్నర్, స్మిత్ బ్యాట్ పడితే బాంబులు పేలుస్తాం! పీఎస్ఎల్‌ను వణికిస్తున్న ఉగ్రవాదుల ప్రకటన..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions