ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు మిస్టరీని మేఘాలయ పోలీసులు ఛేదిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. తాజాగా ప్రధాన నిందితులైన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాకు చెందిన మొబైల్స్ను పరిశీలించారు.
రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ను పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీసులకు పట్టుబడింది. అనంతరం ఆమెను యూపీ పోలీసులు విచారించారు.