Uttar Pradesh: స్పెల్లింగ్ తప్పు రాశాడని ఉపాధ్యాయుడి దాడి.. దళిత విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalit Student Dies After Alleged Assault By Teacher in uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తప్పుగా పదం రాశాడని ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ.. విద్యార్థి మరణించారు. ఈ ఘటన ఔరయ్యా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన 15 ఏళ్ల దళిత విద్యార్థి 10 తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ఇటీవల పరీక్షలో ఒక పదం తప్పుగా రాశాడనే కారణంతో ఉన్నత కులానికి చెందిన ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశారు. దాడి జరిగిన 19 రోజుల తర్వాత విద్యార్థి మరణించాడు.
Read Also: Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
సెప్టెంబర 7న సాంఘిక శాస్త్ర పరీక్షలో ఒక పదాన్ని తప్పుగా రాశాడని నిఖిల్ దోహ్రే అనే బాలుడిని ఉపాధ్యాయుడు అశ్విని సింగ్ తన కుమారుడిపై కర్రలతో, రాడ్ తో దాడి చేశాడని.. స్పృహతప్పి పడిపోయేంత వరకు కొట్టాడని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి చికిత్స కోసం ఉపాధ్యాయుడు రూ. 10,000 ఇచ్చారని.. ఆ తరువాత రూ.30,000 ఇచ్చారని.. తనను కులం పేరుతో దూషించాడని బాలుడి తండ్రి చెబుతున్నారు. అయితే శనివారం రాత్రి బాలుడి పరిస్థితి విషమించడంతో ఇటావా జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించాడు.
బాలుడి కొట్టిన తర్వాత అతని వీడియోను కుటుంబం రికార్డ్ చేసింది. అతని కళ్లు ఉబ్బి ఉండటంతో పాటు అతను స్పృహ కోల్పోయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ టీములను ఏర్పాటు చేశారు. ఎస్టీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!