Tulsi Gabbard: ‘‘ఉగ్ర వేటలో భారత్కి అమెరికా అండ’’.. యూఎస్ స్పై చీఫ్ తులసీ గబ్బర్డ్..
- ఉగ్రవాదుల వేటలో భారత్కి అమెరికా అండగా ఉంటుంది..
- పహల్గామ్ దాడిని ఖండించిన యూఎస్ నిఘా సంస్థల అధిపతి తులసీ గబ్బర్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tulsi Gabbard: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై యావత్ ప్రపంచం భారత్కి అండగా నిలుస్తుంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపారు. మతం ఆధారంగా, హిందువుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే, ప్రపంచ దేశాల నాయకులు, ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద అణిచివేతలో తాము భారత్కి అండగా నిలబడుతామని చెప్పారు.
తాజాగా, అమెరికా గూఢచార సంస్థల అధినేత తులసీ గబ్బర్డ్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల వేటలో భారత్కి అండగా ఉంటామని చెప్పారు. శుక్రవారం తులసీ ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, నేరస్తుల్ని వేటాడేటప్పుడు అమెరికా భారత్కి మద్దతు ఇస్తుందని అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Pakistan: భారత్కి వ్యతిరేకంగా పాక్ పార్లమెంట్లో తీర్మానం..
‘‘పహల్గామ్లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరియు భారతదేశ ప్రజలందరికీ నా న సానుభూతి. ఈ దారుణమైన దాడికి కారణమైన వారిని మీరు వేటాడేటప్పుడు మేము మీతో ఉన్నాము మరియు మీకు మద్దతు ఇస్తున్నాము’’ అని ట్వీట్ చేశారు.
అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘కాశ్మీర్ నుండి తీవ్ర కలతపెట్టే వార్త. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా భారతదేశంతో బలంగా నిలుస్తుంది. కోల్పోయిన వారి ఆత్మల కోసం,గాయపడిన వారి కోలుకోవడం కోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రధాన మంత్రి మోడీ, భారతదేశంలోని అద్భుతమైన ప్రజలకు మా పూర్తి మద్దతు మరియు ప్రగాఢ సానుభూతి ఉంది’’ అని ఆయన ట్రూత్ సోషల్లో రాశారు.
US Director of National Intelligence, Tulsi Gabbard, tweets, "We stand in solidarity with India in the wake of the horrific Islamist terrorist attack, targeting and killing 26 Hindus in Pahalgam. My prayers and deepest sympathies are with those who lost a loved one, PM Narendra… pic.twitter.com/FvSahUKrRM
— ANI (@ANI) April 25, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!