Pakistan: భారత్కి వ్యతిరేకంగా పాక్ పార్లమెంట్లో తీర్మానం..
- భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానం..
- రాజకీయ లక్ష్యంతో కుట్ర చేస్తుందని ఆరోపణలు..
- పహల్గామ్ దాడిని తమ దేశంతో ముడిపెట్టడంపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.
Read Also: Indus water: “సింధు నది” నీరు పాకిస్తాన్కి దక్కకుండా భారత్ వ్యూహం..
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పార్లమెంట్లో ఎగువ సభ సెనెట్ భారత్కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, దీనికి పార్లమెంటు ఎగువ సభలోని పార్టీల నుండి అన్ని పార్టీల మద్దతు లభించింది. ‘‘పనికిరాని, నిరాధారమైన ప్రయత్నాలను’’ తిరస్కరిస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది. అమాయకులైన పౌరుల్ని చంపడం పాక్ విధానాలకు విరుద్ధమని చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడిని తమ దేశంతో ముడిపెట్టడాన్ని పాకిస్తాన్ ఖండించింది.
“పాకిస్తాన్ని జల ఉగ్రవాదం లేదా సైనిక రెచ్చగొట్టడం వంటి ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు సిద్ధంగా ఉంది” అని తీర్మానం పేర్కొంది. సంకుచితమైన రాజకీయ లక్ష్యాల కోసం ఉగ్రవాద సమస్యని భారత్ ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. పాకిస్తాన్ని కుట్ర పూరితంగా భారత్ కించపరుస్తోందని తీర్మానం పేర్కొంది. . సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ప్రకటించడాన్ని కూడా తీర్మానం ఖండించింది మరియు ఈ చర్య “యుద్ధ చర్య” అని పేర్కొంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!