MadyaPradesh: మూత్ర విసర్జన ఘటన ఎఫెక్ట్ …. బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MadyaPradesh: మధ్యప్రదేశ్లో గిరిజనుడిపై వ్యక్తి మూత్ర విసర్జన ఘటనతో బీజేపీకి షాక్ తగిలింది. ఘటనకు కలత చెంది సిద్ధి జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను హైకమాండ్కు పంపించినట్టు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం రాజీనామాను ఉపసంహారించుకోవాలని సూచించ లేదని.. తాను తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని బీజేపీ నేత స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సిద్ధి జిల్లా విభాగం ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్, జిల్లాలో గిరిజన కూలీపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటనపై పార్టీ నుండి వైదొలిగారు. ఆయన స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.
Read also: Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీ నిరాశపర్చింది.. భారత క్రికెట్ దిగ్గజం అసంతృప్తి!
Also Read
గత వారం ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజనుడైన దష్మేష్ రావత్పై మూత్ర విసర్జన చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడిని తన అధికారిక నివాసానికి పిలిపించి, ప్రాయశ్చిత్త చర్యగా అతని పాదాలను కడిగి అనంతరం సత్కరించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు తన రాజీనామా లేఖను ఈ-మెయిల్ చేసినట్లు వివేక్ కోల్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరినప్పటికీ తన రాజీనామానే అంతిమమని తెలిపారు. నా రాజీనామా ఫైనల్. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మకు ఈ-మెయిల్ చేశాను. దానిని బీజేపీ ఆఫీస్ బేరర్స్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. నా రాజీనామాను వెనక్కి తీసుకోమని పార్టీ నన్ను అడగలేదని వివేక్ కోల్ తెలిపారు.
Read also: Double Ismart: ఉస్తాద్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ షురూ అయ్యింది…
వివేక్ కోల్ గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చుర్హాట్ నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ (BSP) టిక్కెట్పై పోటీ చేసి ఓడిపోయారు. వివేక్ కోల్ తన రాజీనామా లేఖలో సిద్ధి నుండి గెలించిన బిజెపి ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లాను నిందించారు. జిల్లాలో గిరిజనుల భూమిని ఆక్రమించడం మరియు ఇతర దౌర్జన్యాలతో సహా గత రెండేళ్లుగా అతను చేస్తున్న చర్యల వల్ల తాను బాధపడ్డానని చెప్పారు. గిరిజన వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడని.. అది తనను బాధించిందని వివేక్ కోల్ పేర్కొన్నారు.
వీడియో వెలుగులోకి వచ్చిన ఒక రోజు తర్వాత, నిందితుడు ప్రవేశ్ శుక్లాను మధ్యప్రదేశ్ పోలీసులు జూలై 5న అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) మరియు SC/ST (అట్రాసిటీల నిరోధక) చట్టం యొక్క సంబంధిత నిబంధనలతో పాటు, కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అభియోగాలు మోపారు.
నిందితుడి ఇంటిలోని అక్రమ భాగాన్ని కూల్చివేయబడింది. ఈ బుల్డోజర్ చర్య తర్వాత, శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లోని ముఖ్యమంత్రి నివాసంలో బాధితుడి పాదాలను కడిగి, అవమానకరమైన సంఘటనపై అతనికి క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది మరియు అతని ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.1.5 లక్షలు అందించింది.
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!