UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- అత్తగారి అంత్యక్రియల్లో దారుణం
- నదిలో చేతులు కడుక్కుంటుండగా మొసలి దాడి
- మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి చనిపోయిందని కూతురు శోకంలో ఉంటే.. గంటల వ్యవధిలోనే కట్టుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఓ ఆడ కూతురికి అంతులేని విషాదంగా మారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలియాలంటే ఈ విషాద వార్తను చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా నివాసి అయిన దీపక్ శర్మ (27), తన అత్తగారైన ఊర్మిళా దేవి (50) మే 19న కేన్సర్స్తో చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం తన భార్య, కుమార్తెతో కలిసి గోండాలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇక ఘాగ్రా నది ఒడ్డున ఊర్మిళా దేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు.. చేతులు కడుక్కునేందుకు దీపక్ నదిలోకి దిగాడు. చేతులు కడుక్కునేందుకు వంగినప్పుడు మెరుపు వేగంతో అతి పెద్ద మొసలి అమాంతంగా దాడి చేసింది. దీపక్ తలను దవడలతో పట్టుకుని వేగంగా నదిలోకి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే లోపలికి తీసుకెళ్లి పోయింది. ఈ హఠాత్తు పరిణామంతో అందరూ షాక్కు గురయ్యారు.
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
బంధువులు, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే జనాలు ఉన్న ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మే 21న పైపు వంతెన సమీపంలో దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అజిత్ కుమార్ రజత్ మాట్లాడుతూ.. దీపక్ శర్మ తన అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడని తెలిపారు. సోనౌలి గ్రామంలోని నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో దీపక్ చేతులు, కాళ్లు కడుక్కోవడానికి నదిలోకి వెళ్లగా ఒక భారీ మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లిందని.. మే 21వ తేదీన అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనూ.. గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!