Doctors Refused To Touch HIV Woman: హెచ్ఐవీ గర్భిణికి వైద్యం అందించడానికి నిరాకరించిన డాక్టర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Hospital Doctors Refused To Touch HIV+ Woman, She Lost Baby: డాక్టర్ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ప్రవర్తించారు. వైద్యం కోసం వచ్చి హెచ్ఐవీ పాజిటివ్ మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారు. కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. గర్బిణి అనే కనికరం లేకుండా వ్యవహారించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ వైద్యం కోసం సమీపంలోని ఫిరోజాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడంతో కొన్ని గంటల పాటు ఆమెను వైద్యం అందించేందుకు నిరాకరించారు ప్రభుత్వ వైద్యులు. చివరకు ఆస్పత్రి ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడంతో బిడ్డను ప్రసవించింది. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో శిశువు మరణించింది.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉన్మాది..
Also Read
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
పురిటినొప్పులతో 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే అంతకుముందు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు క్రిటికల్ గా ఉందని చెబుతూ.. వారు రూ.20,000 డిమాండ్ చేశారు. అయితే దీంతో సదరు బాధితురాలును ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కనీసం నా కుమార్తెను ముట్టుకోలేదని.. నా కుమార్తె నొప్పులతో తల్లడిల్లుతున్నా పట్టించుకోలేదని.. చివరకు ఆస్పత్రి ఇంఛార్జ్ కు ఫోన్ చేస్తే ఆమె వచ్చి జోక్యం చేసుకుని చికిత్స అందించారని మహిళ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు గంటల పాటు మహిళ ప్రసవ వేదనతో బాధపడుతున్నా.. ఒక్క వైద్యుడు కూడా పట్టించుకోలేదని, ఆమెకు చికిత్స చేయలేదని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటలకు బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్చితే రాత్రి 9 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఆస్పత్రి ఇంఛార్జ్ సంగీత అనేజా, మహిళ హెచ్ఐవీ గురించి ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరూ కూడా వైద్యులకు తెలియచేయలేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆమె హెచ్ఐవీ పరిస్థితి తెలియకపోవడంతో సాధారణ పేషెంట్ లాగే ఆమెకు అన్ని పరీక్షలు చేశామని, సిబ్బంది తనతో చెప్పారని ఆమె అన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందని.. రాత్రి 9 గంటలకు ప్రసవం జరిగిందని ఆమె తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!