Delhi: ఢిల్లీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉన్మాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug addict stabs four members of his family to death: ఢిల్లీలో దారుణం జరిగింది. సొంత కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, సోదరి, అమ్మమ్మ ఉన్నారు. డ్రగ్స్ కు బానిసైన కేశవ్(25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, అమ్మమ్మను హత్య చేశాడు. కొన్ని రోజలు క్రితమే కేశవ్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి తిరిగి వచ్చాడు. నిందితుడు అతని మొత్తం కుటుంబాన్ని చంపాడు. ఈ ఘటన జరిగిన తర్వాత అతని ఇతర బంధువుల పట్టుకునే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
Read Also: China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఈ ఘటనలో నిందితుడు కేశవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదునైన ఆయుధంతో బాధితుల గొంతు కోసి, పలుమార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిని దినేష్ కుమార్ (42), దర్శన్ సైనీ (40), ఊర్వశి (22), దీవానో దేవి (75)గా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు గంట వ్యవధిలో నలుగురిని హత్య చేసినట్లు తెలిసింది. మొదటగా తండ్రిని ఆ తరువాత అమ్మమ్మని హత్య చేసి బాత్ రూములో దాచాడు. ఆ తరువాత తల్లిని, ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోదరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. తరుచుగా ఇంట్లో వాళ్లు తనను డ్రగ్ అడిక్ట్ అని తిడుతుండటంతోనే కుటుంబాన్ని చంపేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!