Kanwar Yatra: యాత్ర శాంతియుతంగా కొనసాగాలనే ఆ ఉత్తర్వులు..
- కవాడి యాత్ర మార్గంలో దుకాణాలపై యాజమానుల పేర్ల ప్రదర్శనపై వివాదం..
- యాత్రికులు ఫిర్యాదుతోనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపిన యోగి సర్కార్..
- ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలిపింది. షాప్స్, తినుబండారాల పేర్ల విషయంలో సందేహాలు ఉన్నట్లు యాత్రికులు ఫిర్యాదు చేశారని యోగి సర్కార్ తెలిపింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని.. అందుకు తగినట్లు పోలీసులు చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Read Also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
కాగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్ యజమానులు ఎవరు.. అందులో పని చేసే వారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన పని లేదని చెప్పుకొచ్చింది. గంగానది జలాలను కావడిపై తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, పౌరహక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం ఎంక్వైరీ చేసింది.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!